వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు వంద సీట్లు ఖాయం : మంత్రి ఎర్రబెల్లి

Webdunia
మంగళవారం, 17 జనవరి 2023 (12:19 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఈ యేడాది ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పార్టీకి వంద సీట్లు ఖాయమని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జోస్యం చెప్పారు. అయితే, ప్రజామద్దతు కోల్పోయిన 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేల స్థానంలో కొత్తవారికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ జిల్లాలో జరిగిన బీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
 
బీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని, అయితే పార్టీ విజయానికి ప్రస్తుత ఎమ్మెల్యేల జాబితాలో మార్పులు అవసరమని సీఎం కేసీఆర్ విశ్వసిస్తున్నారని ఎర్రబెల్లి చెప్పారు. గతంలో తాను నిర్వహించిన సర్వేలు కూడా ఎన్నడూ విఫలం కాలేదని మంత్రి దయాకర్ రావు తెలిపారు.
 
ఈ యేడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, మరోసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్యలు, బీజేపీ అధిష్టానం రాష్ట్రంపై దృష్టి సారించడంతో తెలంగాణలో కూడా అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments