Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యక్తి ప్రాణాలు తీసిన మటన్ ముక్క.. ఎలా?

Webdunia
ఆదివారం, 18 డిశెంబరు 2022 (18:12 IST)
మటన్ ముక్క ఓ వ్యక్తి ప్రాణాలు హరించింది. గొంతులో మటన్ ముక్క ఇరుక్కోవడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన తెలంగాణాలోని నిజామాబాద్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం, హనుమాన్ ఫారంలో శనివారం ఓ ఇంటి వద్ద వివాహ వేడుక జరిగింది. ఇందులో రమణ గౌడ్ (45) అనే వ్యక్తి భోజనం చేస్తుండగా, అతడి గొంతులో మటన్ ముక్క ఇరుక్కుంది. దీంతో మాటరాక, ఊపిరాడక తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఆ వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. 
 
కేవలం మటన్ ముక్క ఇరుక్కోవడమే కాకుండా, గుండెపోటు, గ్యాస్ట్రిక్ సమస్య కూడా మరో కారణమని వైద్యులు చెప్పారు. రమణ గౌడ్ మృతితో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. కాగా, గతంలో తెలంగాణాలో ఓ బాలుడి గొంతులో కొబ్బరి ముక్క ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments