పాల్వంచలో విషాదం.. గ్యాస్ లీకై ముగ్గురి సజీవదహనం

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (09:16 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం జిల్లా పాల్వంచలో విషాదం చోటుచేసుకుంది. గ్యాస్ లీక్ కావడంతో ఏర్పడిన మంటల వల్ల ముగ్గురు సజీవదహనమయ్యారు. ఈ విషాదం పాత పాల్వంచ తూర్పు బజార్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తూర్పు బజార్‌కు చెందిన శ్రీలక్ష్మి, మండిగ నాగ రామకృష్ణ అనే దంపతులు ఉన్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే, సోమవారం వేకువజామున ఇంట్లో గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. దీంతో దంపతులతోపాటు ఒక చిన్నారి సజీవదహనమైంది. మరో కుమార్తె తీవ్రంగా గాయపడింది. 
 
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశాయి. తీవ్రంగా గాయపడిన చిన్నారిని పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు 80 శాతం మేరకు శరీరం కాలిపోవడంతో ఆమె పరిస్థితి కూడా విషమంగా మారింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

akhanda 2 Update: అఖండ 2 విడుదల కాకపోవటంతో ఎగ్జిబిటర్స్ చాలా నష్టపోయారు : నట్టికుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments