Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాల్వంచలో విషాదం.. గ్యాస్ లీకై ముగ్గురి సజీవదహనం

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (09:16 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం జిల్లా పాల్వంచలో విషాదం చోటుచేసుకుంది. గ్యాస్ లీక్ కావడంతో ఏర్పడిన మంటల వల్ల ముగ్గురు సజీవదహనమయ్యారు. ఈ విషాదం పాత పాల్వంచ తూర్పు బజార్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తూర్పు బజార్‌కు చెందిన శ్రీలక్ష్మి, మండిగ నాగ రామకృష్ణ అనే దంపతులు ఉన్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే, సోమవారం వేకువజామున ఇంట్లో గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. దీంతో దంపతులతోపాటు ఒక చిన్నారి సజీవదహనమైంది. మరో కుమార్తె తీవ్రంగా గాయపడింది. 
 
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశాయి. తీవ్రంగా గాయపడిన చిన్నారిని పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు 80 శాతం మేరకు శరీరం కాలిపోవడంతో ఆమె పరిస్థితి కూడా విషమంగా మారింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

మైథలాజికల్ జానర్‌లో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా!!

నాగ చైతన్య- శోభిత‌లపై ట్రోల్స్.. ఈ మాట సమంత ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టింది..

Naga Vamsi: సినిమా బాగుంటే చూస్తారు, రివ్యూర్ల రాతలు వల్లకాదు : నాగవంశీ ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments