Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుకు మద్యం.. ఎక్కడ? డబ్బు నిల్వలు తగ్గాయనీ జాలి...

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2023 (10:10 IST)
తెలంగాణ రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించేందుకు ఆ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ నడుంబిగించింది. ఇందుకోసం ఏ రాష్ట్రంలోని కార్పొరేషన్ సంస్థకు రాని ఆలోచన వీరికి వచ్చిది. అంతే... అప్పుకు మద్యాన్ని సరఫరా చేయాలని నిర్ణయించింది. దుకాణందారులకు మద్యాన్ని 50 శాతం అప్పుకు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. దుకారణం దారులు కొనుగోలు చేసే మద్యానికి అదనంగా అందులో 50 శాతం లిక్కరును అప్పుగా ఇవ్వాలని నిర్ణయించింది. 
 
దుకాణదారులు లక్ష రూపాయల విలువైన మద్యం కొనుగోలుకు చలానా తీస్తే ఇప్పటివరకు అంతే మొత్తం మద్యాన్ని సరఫరా చేసేవారు. ఇటీవల మద్యం దుకాణాల కోసం టెండర్లు పిలవగా ఒక్కొక్కరు ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షలు చెల్లించి మరీ పదుల సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. దీంతో వారివద్ద నగదు నిల్వలు తగ్గాయి. ఈ నేపథ్యంలో మద్యం కొనుగోలుకు ఇబ్బందులు పడుతున్నారు. 
 
దీన్ని గుర్తించిన బెవరేజెస్ కార్పొరేషన్ మద్యాన్ని అప్పుగా ఇవ్వాలని నిర్ణయించింది. లక్ష రూపాయల మద్యం కొనుగోలుకు చలానా తీస్తే దానికి అదనంగా రూ.50 వేల విలువైన మద్యాన్ని సరఫరా చేయనుంది. అయితే, ఇందుకోసం పోస్టు డేటెడ్ చెక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ వచ్చే నెల 5 వరకు మాత్రమే అమల్లో ఉంటుంది. ఆలోపు కొనుగోలు చేసే మద్యానికి ఇది వర్తిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments