Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమ్మె విరమించిన జూడాలు.. తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పడంతో..?

Webdunia
గురువారం, 27 మే 2021 (20:16 IST)
తెలంగాణలో జూడాలు సమ్మె విరమించారు. తెలంగాణలో సమ్మె బాట పట్టిన జూనియర్ డాక్టర్లు వెనక్కి తగ్గారు. సీఎం కేసీఆర్ తమ డిమాండ్ల పరిష్కారం విషయంలో సానుకూలంగా స్పందించడంతో తాము సమ్మె విరమిస్తున్నట్టు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. 
 
తెలంగాణలో సమ్మె బాట పట్టిన జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి డిమాండ్లలో కీలకమైన వాటికి పచ్చజెండా ఊపింది. స్టైఫండ్‌ను 15 శాతం పెంచాలన్న జూనియర్ డాక్టర్ల డిమాండ్‌కు సానుకూలంగా స్పందించిన తెలంగాణ ప్రభుత్వం.. ఇందుకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
 
సీనియర్ రెసిడెంట్లకు రూ. 70 వేల నుంచి 80,500 వరకు పెంచింది. పెరిగిన స్టైఫండ్ ఈ ఏడాది జనవరి 1 నుంచే అమలవుతాయని పేర్కొంది. ఇక తాము, తమ కుటుంబసభ్యులు కరోనా బారిన పడితే నిమ్స్‌లో చికిత్స అందించాలన్న జూడాల డిమాండ్‌కు తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 
 
వారి కోసం నిమ్స్‌లో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఇక కరోనాతో జూడాలు మరణిస్తే వారికి అందించే ఎక్స్‌గ్రేషియా విషయంలోనూ తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments