సమ్మె విరమించిన జూడాలు.. తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పడంతో..?

Webdunia
గురువారం, 27 మే 2021 (20:16 IST)
తెలంగాణలో జూడాలు సమ్మె విరమించారు. తెలంగాణలో సమ్మె బాట పట్టిన జూనియర్ డాక్టర్లు వెనక్కి తగ్గారు. సీఎం కేసీఆర్ తమ డిమాండ్ల పరిష్కారం విషయంలో సానుకూలంగా స్పందించడంతో తాము సమ్మె విరమిస్తున్నట్టు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. 
 
తెలంగాణలో సమ్మె బాట పట్టిన జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి డిమాండ్లలో కీలకమైన వాటికి పచ్చజెండా ఊపింది. స్టైఫండ్‌ను 15 శాతం పెంచాలన్న జూనియర్ డాక్టర్ల డిమాండ్‌కు సానుకూలంగా స్పందించిన తెలంగాణ ప్రభుత్వం.. ఇందుకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
 
సీనియర్ రెసిడెంట్లకు రూ. 70 వేల నుంచి 80,500 వరకు పెంచింది. పెరిగిన స్టైఫండ్ ఈ ఏడాది జనవరి 1 నుంచే అమలవుతాయని పేర్కొంది. ఇక తాము, తమ కుటుంబసభ్యులు కరోనా బారిన పడితే నిమ్స్‌లో చికిత్స అందించాలన్న జూడాల డిమాండ్‌కు తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 
 
వారి కోసం నిమ్స్‌లో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఇక కరోనాతో జూడాలు మరణిస్తే వారికి అందించే ఎక్స్‌గ్రేషియా విషయంలోనూ తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హనీ మేడమ్ సెల్ఫీ ప్లీజ్ అంటూ నటి నడుమును అసభ్యంగా తాకిన వ్యక్తి, వీడియో వైరల్

Salman Khan: సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి, దిల్ రాజు కాంబినేషన్ లో చిత్రం ప్రకటన

Hema: ఆ టైంలో మా ఇంటికి పనిమనిషి కూడా రానంది : హేమ ఆవేదన

Dhurandhar sequel collections:: ధురందర్ ది రివెంజ్ 11 రోజుల్లోనే ₹1365 కోట్లను వసూలు చేసింది

Sesh Adavi: డెకాయిట్‌ చిచ్చుబుడ్డి ఫుల్ సాంగ్ లో మెరిసిన అడివి శేష్, జోనితా గాంధీ, పవన్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్-తమిళనాడు చాప్టర్ భాగస్వామ్యం

రవీనా టాండన్, రాషా థడానీలతో తల్లి-కూతుళ్ల నమ్మకాన్ని వేడుక చేసిన గార్నియర్ కలర్ నాచురల్స్

మహిళల్లో రుతుక్రమం ఎందుకు ఆలస్యం, ప్రధాన కారణాలు ఏమిటి?

పచ్చి కూరగాయల్లో తినకూడనివి ఏవి?

మోతాదుకి మించి గ్రీన్ టీ తాగితే...

తర్వాతి కథనం
Show comments