Webdunia - Bharat's app for daily news and videos

Install App

జబర్దస్త్ హైపర్ ఆదిపై జాగృతి స్టూడెంట్స్ ఆగ్రహం

Webdunia
మంగళవారం, 15 జూన్ 2021 (11:48 IST)
బుల్లితెర నటుడు, జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది మరో వివాదంలో చికున్నాడు. తాజాగా ఆయన ఓ వివాదంలో చిక్కుకోవడంతో జాగృతి స్టూడెంట్స్ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
సాధారణంగా హైపర్ ఆది చేసే స్క్రిప్టుల్లో కామెడీతో పాటు కాంట్రవర్సీలు అధికంగానే ఉంటాయి. ఈయన చేసే ప్రతీసారి స్కిట్స్‌లో ఈయన చేసే కామెడీ కొందరి మనోభావాలను దెబ్బ తిస్తూనే ఉంటుందంటూ విమర్శలు వస్తూనే ఉన్నాయి.
 
వ్యక్తుల వరకు అయితే ఓకే కానీ వ్యవస్థను విమర్శిస్తే తిప్పలు తప్పువు. ఇప్పుడు ఇదే జరిగింది. హైపర్ ఆదికి దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఈయనపై ఎల్బీ నగర్ పోలీసులకు తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. 
 
దానికి కారణం ఈయన తెలంగాణ బాష, యాసను అవమానిస్తూ మాట్లాడటమే. హైపర్ ఆదిపై ఎల్బీ నగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డికి తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు.
 
జూన్ 12 ఆదివారం రోజున ఈ టీవీలో ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమంలో తెలంగాణ బతుకమ్మను, గౌరమ్మను, తెలంగాణ భాష యాసని కించపరిచే విధంగా ఆది స్క్రిప్ట్ చేశాడని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments