Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది : హైకోర్టు

Webdunia
ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (17:21 IST)
పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. జిల్లాలను పెంచే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన అధికార పరిధిలోనే వ్యవహరించిందని పేర్కొంటూ ఇందుకు సంబంధించి దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేసింది. 
 
వరంగల్ జిల్లాకు చెందిన రంగు బాలలక్ష్మితో పాటు మరో నలుగురు కలిసి ఈ పిల్‌ను కోర్టులో దాఖలు చేశారు. ప్రభుత్వం జిల్లాలను అశాస్త్రీయ విధానంలో, ఏకపక్షంగా విభజించిందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి అధికారులు అనుసరించిన విధానం తెలంగాణ డిస్ట్రిక్ట్స్ యాక్ట్ 1974, తెలంగాణ డిస్ట్రిక్ట్ రూల్స్ 2016 నిబంధనలకు విరుద్ధంగా ఉందని వాదించారు. ఈ వాదనలు ఆలకించిన ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలిలతో కూడిన ధర్మాసనం జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం అధికారం ఉందని స్పష్టం చేసింది. 
 
కొత్త జిల్లాల రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు వెనుక చెడు ఉద్దేశ్యాలు ఉన్నట్టు పిటిషన్లు నిరూపించలేకపోయారని, అలాంటపుడు న్యాయ సమీక్షకు ఆదేశించలేమని ధర్మాసనం అభిప్రాయపడుతూ పిటిషన్‌ను కొట్టివేసింది. 

సంబంధిత వార్తలు

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments