Webdunia - Bharat's app for daily news and videos

Install App

8 వేల దళిత కుటుంంబాలకు రూ.800 కోట్లు బదిలీ

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (09:49 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం దళితబంధు. ఈ పథకం అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టికేంద్రీకరించారు. ఈ పథకం అమలులో భాగంగా, 8 వేల దళిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున రూ.800 కోట్ల నగదు బదిలీ జరిగినట్టు ప్రభుత్వం తెలిపింది. 
 
హుజూరాబాద్‌ నియోజకవర్గంలో అమలు చేస్తున్న ఈ పథకంలో భాగంగా ఇప్పటివరకు 20 వేల దళిత కుటుంబాలను గుర్తించిన ప్రభుత్వం 8 వేల కుటుంబాలకు నగదు బదిలీ చేసింది. నియోజకవర్గంలో గత రెండు వారాలుగా  గ్రామాల వారీగా లబ్ధిదారుల నుంచి  పంచాయతీ కార్యదర్శులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 
 
వీటిని పరిశీలించిన ఎంపీడీవోలు లబ్ధిదారుల జాబితాను రూపొందించారు. దీని ఆధారంగా గత మూడు రోజులుగా అర్హుల బ్యాంకు ఖాతాల్లో రూ.10 లక్షల చొప్పున జమ చేస్తున్నారు. శుక్రవారం రూ.100 కోట్లు, శనివారం రూ.200 కోట్లు, నిన్న రూ.500 కోట్లు చొప్పున జమచేసినట్టు అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments