Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంబంధం లేని ప్రాంతంలో కృష్ణా బోర్డు ఏర్పాటా? : తెలంగాణ మెలిక

Webdunia
బుధవారం, 20 జనవరి 2021 (15:36 IST)
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయం విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం తమకు సమ్మతం కాదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది తమకు అనుకూలం కాదని పేర్కొంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది. 
 
విజయవాడలో ఏర్పాటు చేస్తామంటే అంగీకారం తెలిపామని, ఇప్పుడు కృష్ణా బేసిన్‌కు బయట, సంబంధం లేని ప్రాంతంలో ఏర్పాటు చేయడం వల్ల కార్యకలాపాలకు ఇబ్బందవుతుంది. 
 
అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో కూడా ఈ విషయం చర్చించకుండా అకస్మాత్తుగా విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తామని చెప్పడం సరైంది కాదంది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌కు సోమవారం లేఖ రాశారు.
 
దీంతోపాటు కృష్ణా బోర్డు, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్‌ మరికొన్ని ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టినట్లు కూడా బోర్డు దృష్టికి తెలంగాణ తెచ్చింది. ఇటీవల పరిపాలనా అనుమతి ఇచ్చిన మూడు ప్రాజెక్టుల గురించి వివరించినట్లు తెలిసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments