Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో విద్యా సంస్థలకు సెలవులు పొడగింపు

Webdunia
ఆదివారం, 16 జనవరి 2022 (09:48 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా వుంది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని రకాల విద్యా సంస్థలను ఈ నెల 30వ తేదీ వరకు పొడగిస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వెల్లడించారు. 
 
ఇదిలావుంటే శనివారం ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యం శాఖ విడుదల చేసిన బులిటెన్ మేరకు, రాష్ట్రంలో 53,073 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా వారిలో 1,963 మందికి ఈ వైరస్ సోకింది. 
 
ఇందులో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,075 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 168, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 150 కేసుల చొప్పున నమోదయ్యాయి. 
 
అదేసమయంలో ఈ కరోనా వైరస్ నుంచి 1,620 మంది కోలుకోగా, ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,07,162 పాజిటివ్ కేసుల నమోదు కాగా, ఈ వైరస్ నుంచి 6,81,091 మందికి కోలుకున్నారు. మరో 22,017 యాక్టివ్ కేసులు రాష్ట్రంలో ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments