Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధనిక రాష్ట్రం ఖజానా ఖాళీ... తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు బౌన్స్!

దేశంలో రెండో ధనిక రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి అలాంటి ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడానికి వీల్లేదు. కానీ, ప్రస్తుత పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు బ

Webdunia
ఆదివారం, 23 అక్టోబరు 2016 (10:56 IST)
దేశంలో రెండో ధనిక రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి అలాంటి ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడానికి వీల్లేదు. కానీ, ప్రస్తుత పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు బౌన్స్ అవుతున్నాయి. దీనికి కారణం ఆ రాష్ట్ర ఖజానాలో పైసా లేదట. అందుకే చెక్కులను బౌన్స్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు చెల్లలేదని మీడియా కథనాలు వస్తున్నాయి. ఈ వార్తలు ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చేవిలా ఉన్నాయి. దీనిపై వివరణ ఇస్తూ, కొత్త జిల్లాలు ఏర్పడిన వేళ, చెక్కులను చెల్లించకుండా తాత్కాలికంగా నిలిపివేశామే తప్ప, అవి చెల్లలేదనడం భావ్యం కాదని ఆ పార్టీ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. 
 
తెలంగాణ డబ్బున్న రాష్ట్రమని చెప్పుకునే కేసీఆర్, చెక్కులు బౌన్స్ కావడంపై ఏమంటారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి, మల్లన్న సాగర్ ప్రాంతం నేత బెల్లయ్య నాయక్ ప్రశ్నించారు. ఓ వైపు వివిధ పథకాలకు నిధులను ఆపవద్దని కేసీఆర్ చెబుతున్న వేళ, చెక్కు బౌన్సుల వ్యవహారం తెరపైకి రావడం గమనార్హం.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments