Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమకూ ఒక కేసీఆర్‌ కావాలని ఏపీ ప్రజలు భావిస్తున్నారు : ఈటల రాజేందర్

తమకూ ఒక కేసీఆర్ కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆయన సచివాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తమకూ ఒక కేసీఆర్‌ ఉంటే బాగుండునని

Webdunia
శనివారం, 4 మార్చి 2017 (09:32 IST)
తమకూ ఒక కేసీఆర్ కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆయన సచివాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తమకూ ఒక కేసీఆర్‌ ఉంటే బాగుండునని ఏపీ ప్రజలు భావిస్తున్నారన్నారు. 
 
తెలంగాణ ప్రభుత్వం పని, కేసీఆర్ పరిపాలనతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోటీ పడాలని, కుట్రలు, కుతంత్రాలు చేయవద్దంటూ ధ్వజమెత్తారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత.. చిన్న రాష్ట్రాలే అభివృద్ధిలో ముందున్నాయని ఈటల గుర్తు చేశారు. గుజరాత్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయన్నారు. 
 
ఇరు రాష్ట్రాల ప్రజలూ చంద్రబాబు మాటతీరు, మొసలి కన్నీరును చూసి అసహ్యించుకుంటున్నారన్నారు. ఏపీ, తెలంగాణలు విడిపోయి అభివృద్ధి చెందుతున్న తరుణంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా చంద్రబాబు మాట్లాడడం అభ్యంతరకరమని ఈటల వ్యాఖ్యానించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments