Webdunia - Bharat's app for daily news and videos

Install App

9 నుంచి తెలంగాణ ప్రవేశ పరీక్షలు

Webdunia
సోమవారం, 24 ఆగస్టు 2020 (09:30 IST)
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పరీక్షల తేదీలను ప్రభుత్వం ఖరారు చేసింది. వచ్చే నెల 9వ తేదీ నుంచి ఎంసెట్‌తోపాటు పీజీఈసెట్‌, ఐసెట్‌, ఎడ్‌సెట్‌, లాసెట్‌ తేదీలను కూడా నిర్ణయించింది.

ఇందులో ఇంజినీరింగ్‌ విభాగ పరీక్ష 4 రోజులపాటు 8 విడతల్లో, అగ్రికల్చర్‌ విభాగ పరీక్ష 2 రోజులపాటు 4 విడతల్లో జరగనుంది. అలాగే పీజీ ఈసెట్‌ 8 విడతల్లో(4 రోజులు), ఐసెట్‌ 3 విడతల్లో(రెండు రోజులు), ఎడ్‌ సెట్‌ 3 విడతల్లో (రెండు రోజులు) నిర్వహించనున్నారు.

పరీక్ష కేంద్రాల్లో కరోనా నియంత్రణ చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించారు. భౌతిక దూరం పాటించేందుకు వీలుగా పరీక్ష కేంద్రాలను భారీగా పెంచారు.

అలాగే, విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానిక జిల్లా కేంద్రాల్లోనే పరీక్షలకు హాజరయ్యేలా అవకాశమిచ్చారు.

ఈ నెల 31న ఈసెట్‌తో ప్రారంభం కానున్న పరీక్షలు.. అక్టోబరు 4న జరిగే లాసెట్‌తో ముగియనున్నాయి.  పరీక్షలకు మొత్తం 4,00,728 మంది విద్యార్థులు హాజరు కానున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments