Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రం వేరుబడినా ఈ ఆంధ్రా జడ్జీల గోలేంటి : న్యాయ మంత్రికి తెరాస నేతల ఫిర్యాదు

Webdunia
బుధవారం, 25 మే 2016 (10:46 IST)
తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కూడా తమ రాష్ట్రంలోని కోర్టుల్లో ఆంధ్రా జడ్జీలు ఇంకా కొనసాగుతుండటంపై తెరాస రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కింది కోర్టుల్లో ఆంధ్రా జడ్జీల గోల లేకుండా చేయాలని వారు కేంద్ర న్యాయమంత్రి సదానంద గౌడకు ఫిర్యాదు చేశారు. 
 
కింది కోర్టుల్లో న్యాయమూర్తులు సహా అధికారులు, సిబ్బంది విభజనలో తెలంగాణకు ఇప్పటికీ అన్యాయమే జరుగుతుందని, దీన్ని సరిదిద్దడానికి వెంటనే చొరవ తీసుకోవాలని సదానందకు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు డాక్టర్ వేణుగోపాలాచారి, రామచంద్రు తెజావత్ సమర్పించిన వినతి పత్రంలో పేర్కొన్నారు. 
 
హైకోర్టు నిబంధనల ప్రకా రం 60:40 నిష్పత్తిలో ఉద్యోగుల కేటాయింపు ఉండాలని, అయితే దీన్ని బుట్టదాఖలు చేయడంతో తెలంగాణకు అన్యాయం జరిగిందని వారు పేర్కొన్నారు. కింది కోర్టుల్లో తెలంగాణకు జరిగిన కేటాయింపుల్లో మొత్తం 95 జడ్జీల పోస్టుల్లో 46మంది ఆంధ్ర ప్రాంతానికి చెందినవారేనని గుర్తు చేశారు. 
 
ఉమ్మడి హైకోర్టులో వివిధ స్థాయిల్లో అధికారులు, సిబ్బంది పోస్టుల్లో పనిచేస్తున్న 197మందిలో 48మందే తెలంగాణవారన్నారు. ఈ విధంగా చూస్తే న్యాయమూర్తి మొదలు కిందికోర్టుల్లో జడ్జీలు, సిబ్బందివరకు తెలంగాణ ఇంకా త్యాగాలు చేస్తూ అన్యాయానికి గురవుతూనే ఉన్నదని మంత్రికి వివరించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments