తెలంగాణలో కోవిడ్ విజృంభణ.. 24గంటల్లో 58 మంది మృతి

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (10:34 IST)
తెలంగాణలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. గడిచిన 24 గంటల్లో 80,181 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 7,994 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య 4,27,960కి చేరింది. 
 
నిన్న 58 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మహమ్మారి వ్యాప్తి రాష్ట్రంలో మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 2,208కి పెరిగింది. ఒక్క రోజే 4,009 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,49,692కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 76,060 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
 
రాష్ట్రంలో రికవరీ రేటు 81.71శాతం ఉండగా.. మరణాల రేటు 0.51శాతంగా ఉంది. కొత్తగా నమోదు అయిన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 1,630 కేసులు నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nitesh Tiwari: నితేష్ తివారీ.. రామాయణం మొదటి కట్ కు లాస్ ఏంజిల్స్‌లో ప్రశంస

Mamita Baiju : ప్రదీప్ రంగనాథన్ అంటే ఎగతాళి, కానీ ఇప్పుడు స్వంత బేనర్ స్ళాయికి ఎదిగాడు

Ram: మృత్యుంజయ్ లో జిందగీ పాట, చైల్డ్ సెంటిమెంట్ అద్భుతంగా వుంది : రామ్ పోతినేని

Shivani Nagaram: తిరుమల దర్శనంపై కాంట్రవర్సీకి శివాని నాగారం వివరణ

Shanmukh Jaswanth: షణ్ముఖ్ జస్వంత్‌- వైష్ణవిల నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తుమ్ములు, వదలని దగ్గు వస్తే HMPV వ్యాధి కావచ్చు, ఏం చేయాలి?

తులసి రసంతో తేనెను కలిపి తీసుకుంటే ఏమవుతుంది?

మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

సీజనల్ వ్యాధులను దరిచేరకుండా చేసే సూప్స్, ఏంటవి?

ఎండుద్రాక్షలు తింటే 7 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments