Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ కాంగ్రెస్‌లో సంక్షోభం.. సీనియర్ నేతల తిరుగుబాటు

Webdunia
ఆదివారం, 18 డిశెంబరు 2022 (12:26 IST)
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోమారు సంక్షోభం తలెత్తే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రకటించిన పీసీసీ కమిటీలపై పలువురు సీనియర్లు బాహాటంగానే తమ అక్కుసు వెళ్లగక్కుతున్నారు. పనిలోపనిగా సీనియర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో సీనియర్ నేతలంతా సమావేశమయ్యారు. ఇందులో పార్టీలో సీనియర్లుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, మధుయాష్కీ గౌడ్, దామోదర రాజనర్సింహా తదితరులు పాల్గొన్నారు.  
 
ఇటీవల ప్రకటించిన పీసీసీ కమిటీల్లో 108 మందికి స్థానం కల్పించారు. అందులో సగం మంది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినవారేనని సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు. పైగా, తమదే అసలు సిసలైన కాంగ్రెస్ పార్టీ అంటూ వారు ఆరోపిస్తున్నారు. వలస నేతలు, టీడీపీ నేతలు అంటూ రేవంత్ రెడ్డి తదితరులను ఉద్దేశించి సీనియర్ నేతలు ఆరోపణలు గుప్పించారు. 
 
పార్టీలోని సీనియర్ నేతలు విస్మరించి టీడీపీ నుంచి వచ్చిన తన వారికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారన్నది సీనియర్ నేతల ప్రధాన ఆరోపణగా ఉంది. పైగా, పార్టీ కోసం శ్రమిస్తున్న తమపై కోవర్టులనే ముద్ర వేస్తున్నారని వారు మండిపడుతున్నారు. ఈ అంశాలన్నింటినీ అధిష్టానం దృష్టికి తీసుకెళతామని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బతికించుకోవడమే తమ ఏకైక లక్ష్యమని వారు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments