Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ టూర్లో ఇబ్బంది పడ్డ సీనియర్ కాంగ్రెస్ నాయకులు

రాహుల్ గాంధీ తెలంగాణాలో జరిపిన రెండు రోజుల పర్యటన కాంగ్రెస్ క్యాడర్‌కు ఉత్సాహాన్ని నింపింది. అయితే కొంతమంది సీనియర్ నాయకులు మాత్రం రాహుల్ టూర్లో ఇబ్బంది పడ్డట్టు సమాచారం. హోటల్ హరిత ప్లాజాలో రాహుల్‌తో ఎడిటర్స్ సమావేశం ఏర్పాటు చేశారు.

Webdunia
బుధవారం, 15 ఆగస్టు 2018 (17:40 IST)
రాహుల్ గాంధీ తెలంగాణాలో జరిపిన రెండు రోజుల పర్యటన కాంగ్రెస్ క్యాడర్‌కు ఉత్సాహాన్ని నింపింది. అయితే కొంతమంది సీనియర్ నాయకులు మాత్రం రాహుల్ టూర్లో ఇబ్బంది పడ్డట్టు సమాచారం. హోటల్ హరిత ప్లాజాలో రాహుల్‌తో ఎడిటర్స్ సమావేశం ఏర్పాటు చేశారు. 
 
ఈ సందర్భంగా కొంతమంది పార్టీ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే పత్రికలు టీవీ చానెల్స్ ప్రతినిధులు, ఫార్టీనాయకుల పేర్లను పిసిసి ఎస్పీజీ పంపించింది. అయితే ఎస్పీజీకి పంపిన జాబితాలో జానారెడ్డి, షబ్బీర్ ఆలీ పేర్లు లేకపోవడంతో అలిగి ఇద్దరూ ప్లాజా నుంచి బయటికి వెళ్లిపోవడానికి సిద్ధపడ్డారు.
 
ఇది గమనించిన మరో నేత ఇద్దరినీ బతిమాలి లోపలికి తీసుకొచ్చి కూర్చో పెట్టారు. లోపల కూడా వాళ్లిద్దరూ మౌనంగానే కూచున్నారు. మరోవైపు రాహుల్ గాంధీతో సీనియర్ల మీటింగ్ జరిగే సమయంలో రేవంత్ రెడ్డి లోపలికి వెళ్లకుండా అనుమతి నిరాకరించారు. ఇక రాహుల్‌తో సీనియర్ల మీటింగ్‌కు తనకు కూడా అనుమతి లేదనడంతో సునీతా లక్ష్మారెడ్డి కంటతడి పెట్టుకున్నట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments