Webdunia - Bharat's app for daily news and videos

Install App

గవర్నర్‌కు తెరాస సభ్యత్వం ఇవ్వొచ్చు.. నరసింహన్‌కు భజన శాఖ కేటాయించండి

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌పై ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. కాంగ్రెస్ సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి మాట్లాడుతూ, గవర్నర్ నరసింహన్‌కు రాజకీయాలపై ఆసక

Webdunia
ఆదివారం, 21 జనవరి 2018 (15:39 IST)
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌పై ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. కాంగ్రెస్ సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి మాట్లాడుతూ, గవర్నర్ నరసింహన్‌కు రాజకీయాలపై ఆసక్తి ఉంటే టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరవచ్చన్నారు. 
 
నరసింహన్‌ వ్యాఖ్యలు గవర్నర్‌ హోదాకు తగదన్నారు. కేసీఆర్‌కు కితాబు ఇవ్వడానికే గవర్నర్‌ కాళేశ్వరం పర్యటన అని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే కాంగ్రెస్‌ హయాంలోనే ప్రాణహిత - చేవెళ్లకు అంకురార్పణ జరిగిందని, గవర్నర్‌ ప్రాజెక్టు చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని అన్నారు.
 
అలాగే, మరో సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ, గవర్నర్‌ ప్రభుత్వ పథకాలు మెచ్చుకుంటే ఫరవాలేదు గానీ.. సీఎంను కాళేశ్వర చంద్రశేఖర్‌ రావుగా సంభోదించడమేంటిని నిలదీశారు. తెరాస ప్రభుత్వం వీలుంటే నరసింహన్‌కు 'భజన శాఖ' కేటాయించాలన్నారు. 
 
తెలంగాణ ప్రజలు గవర్నర్‌ నరసింహన్‌ను కల్వకుంట్ల నరసింహన్‌ రావు అని అనుకుంటున్నారన్నారు. అలాగే ఫిరాయింపు ఎమ్మెల్యేలను మంత్రులుగా ప్రమాణం చేయించిన రోజే రాజ్‌భవన్ ప్రతిష్ట మంటగలిసిందని పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments