Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్ భార్య ప్రసవం... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 4 అక్టోబరు 2022 (12:35 IST)
తెలంగాణ రాష్ట్రంలో మరో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలెక్టర్ భవేష్ మిశ్రా భార్య, ములుగు జిల్లా అడిషినల్ కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం రాత్రి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. 
 
ఈమెకు ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ సంజీవయ్య ఆధ్వర్యంలో సాధారణ డెలివరీ కోసం ప్రయత్నించినప్పటికీ శిశువు బరువు అధికంగా ఉండటంతో అది సాధ్యం కాలేదు. దీంతో ఆస్పత్రిలోనే గైనకాలజిస్టు వైద్యులు డాక్టర్ శ్రీదేవి, లావణ్య, సంధ్యారాణి, విద్యలు కలిసి సిజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. శిశువు బరువు 3 కేజీల 400 గ్రాములుగా పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్ సంజీవయ్య తెలిపారు. 
 
జిల్లా కలెక్టరుగా భవ్యేష్ మిశ్రా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు మెరుగుపరిచేందుకు, వాటి అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూనే వున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఆస్పత్రులపై సాధారణ ప్రజల్లో భరోసా, నమ్మకం కలిగించేందుకు వీలుగా తన భార్యకు ప్రభుత్వ ఆస్పత్రిలోనే డెలివరీ చేయించి, ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments