Webdunia - Bharat's app for daily news and videos

Install App

లెక్కింపు పూర్తికాకముందే ఓటమిని అంగీకరించిన ఉత్తమ్ సతీమణి.. నిష్క్రమణ

Webdunia
గురువారం, 24 అక్టోబరు 2019 (11:45 IST)
తెలంగాణ రాష్ట్రంలోని హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం చేపట్టారు. తొలి రౌండ్‌లో కాంగ్రెస్ పార్టీ అధిక్యం సాధించినప్పటికీ... ఆ తర్వాత అధికార తెరాస అభ్యర్థి సైదిరెడ్డి ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చారు. ఫలితంగా కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి ఓట్ల లెక్కింపు పూర్తికాకముందే లెక్కింపు కేంద్రం నుంచి ఇంటికి వెళ్లిపోయారు. 
 
ఈ ఓట్ల లెక్కింపులో 10 రౌండ్ల కౌంటింగ్ ముగిసేవరకు తెరాస అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 18 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు. దీంతో ఆయన గెలుపు దాదాపు ఖాయమైపోగా, ఆయన మద్దతుదారులు సంబరాలు ప్రారంభించారు. తాను ముందుగా చెప్పినట్టుగానే బంపర్ మెజారిటీతో విజయాన్ని సొంతం చేసుకోనున్నానని ఈ సందర్భంగా సైదిరెడ్డి వ్యాఖ్యానించారు. 
 
కాగా, ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సైది రెడ్డికి 51032 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతికి 32 వేల పై చిలుకు ఓట్లు వచ్చాయి. అయితే, ఈ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీతో పాటు తెరాస అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అందువల్లే ప్రచారం హోరాహోరీగా సాగింది. ముఖ్యంగా, కాంగ్రెస్ పార్టీ నేతలంతా హుజూర్ నగర్‌లోనే మకాం వేసి ప్రచారం చేశారు. అయితే, ఓటర్లు మాత్రం కారుకే పట్టంకట్టారు. ఫలితంగా కాంగ్రెస్ కంచుకోటగా ఉండే హుజూర్ నగర్‌లో తొలిసారి గులాబీ జెండా ఎగరనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments