Webdunia - Bharat's app for daily news and videos

Install App

లెక్కింపు పూర్తికాకముందే ఓటమిని అంగీకరించిన ఉత్తమ్ సతీమణి.. నిష్క్రమణ

Webdunia
గురువారం, 24 అక్టోబరు 2019 (11:45 IST)
తెలంగాణ రాష్ట్రంలోని హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం చేపట్టారు. తొలి రౌండ్‌లో కాంగ్రెస్ పార్టీ అధిక్యం సాధించినప్పటికీ... ఆ తర్వాత అధికార తెరాస అభ్యర్థి సైదిరెడ్డి ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చారు. ఫలితంగా కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి ఓట్ల లెక్కింపు పూర్తికాకముందే లెక్కింపు కేంద్రం నుంచి ఇంటికి వెళ్లిపోయారు. 
 
ఈ ఓట్ల లెక్కింపులో 10 రౌండ్ల కౌంటింగ్ ముగిసేవరకు తెరాస అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 18 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు. దీంతో ఆయన గెలుపు దాదాపు ఖాయమైపోగా, ఆయన మద్దతుదారులు సంబరాలు ప్రారంభించారు. తాను ముందుగా చెప్పినట్టుగానే బంపర్ మెజారిటీతో విజయాన్ని సొంతం చేసుకోనున్నానని ఈ సందర్భంగా సైదిరెడ్డి వ్యాఖ్యానించారు. 
 
కాగా, ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సైది రెడ్డికి 51032 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతికి 32 వేల పై చిలుకు ఓట్లు వచ్చాయి. అయితే, ఈ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీతో పాటు తెరాస అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అందువల్లే ప్రచారం హోరాహోరీగా సాగింది. ముఖ్యంగా, కాంగ్రెస్ పార్టీ నేతలంతా హుజూర్ నగర్‌లోనే మకాం వేసి ప్రచారం చేశారు. అయితే, ఓటర్లు మాత్రం కారుకే పట్టంకట్టారు. ఫలితంగా కాంగ్రెస్ కంచుకోటగా ఉండే హుజూర్ నగర్‌లో తొలిసారి గులాబీ జెండా ఎగరనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments