Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశికళ రీఎంట్రీ : బీజేపీ ప్రయత్నాల్లో వివేకం - భవిష్యత్ విజ్ఞత ఉంది : విజయశాంతి

Webdunia
శుక్రవారం, 26 మార్చి 2021 (12:31 IST)
త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత ప్రియ నెచ్చెలి శశికళ మ‌ళ్లీ అన్నాడీఎంకేలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఓ పన్నీర్ సెల్వం చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. 
 
ఈ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రాంతానికి చెందిన బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ‌శికళ అన్నాడీఎంకేలో ఉండాలని బీజేపీ అధిష్టానం చేసిన ప్రయత్నంలో వివేకం, భవిష్యత్ విజ్ఞత ఉన్నాయ‌న్నారు. 
 
ఆ ప్రయత్నాన్ని వ్యతిరేకించిన అన్నాడీఎంకే నేతలు పొరపాటు చేసినట్లు భావిస్తున్న ధోరణి నేటి వార్తలలో కనిపిస్తోందని ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. ఏది ఏమైనా తమిళనాట ఎన్డీఏ కూటమి విజయం సాధించాలని కోరుకుంటున్నానని విజ‌య‌శాంతి తెలిపారు.  
 
కాగా, అక్రమాస్తుల కేసులో నాలుగున్నరేళ్ళ జైలుశిక్షను అనుభవించిన శశికళ... ఇటీవలే విడుదలయ్యారు. ఆ తర్వాత ఆమె తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టి చక్రం తిప్పుతారని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, ఆమె ప్రతి ఒక్కరికీ షాకిస్తూ క్రియాశీలక రాజకీయా నుంచి తప్పుకున్న విషయం తెల్సిందే. ఆమె తీసుకున్న సంచలన నిర్ణయం వెనుక బీజేపీ హస్తముందనే ప్రచారం లేకపోలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments