Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో భారీ వర్షాలు.. వాయిదా పడిన పరీక్షలు

Webdunia
మంగళవారం, 20 అక్టోబరు 2020 (17:38 IST)
హైదరాబాదులో భారీ వర్షాల కారణంగా తెలంగాణలో అన్ని రకాల పరీక్షలను దసరా వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది ఆ రాష్ట్ర సర్కారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూ హైదరాబాద్ యూనివర్సిటీలు ఈ నెల 19 నుంచి 20 వరకు జరిగే పరీక్షలను వాయిదా వేసుకున్నాయి. 
 
తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరదల కారణంగా అనేకమంది ఇబ్బంది పడుతున్నారు. ఈ సమయంలో పరీక్షలు నిర్వహిస్తే చాలామంది విద్యార్థులకు సమస్యలు ఎదురయ్యే పరిస్థితి ఉంది. 
 
మరోవైపు వాతావరణ శాఖ సైతం మరికొన్ని రోజులు భారీగా వర్షాలు కురిసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల రెగ్యులర్, సప్లమెంటరీ పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్విట్టర్ ద్వారా తెలిపారు.
 
అలాగే భారీ వర్షాల నేపథ్యంలో అంబేద్కర్ యూనివర్సిటీ పలు పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21, 22, 23 తేదీల్లో జరగనున్న యూజీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ ఓ ప్రకటన విడుదల చేసింది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments