Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కేసీఆర్‌నే అంతు చూస్తానన్నారు.. సాక్ష్యాలు తారుమారు చేస్తారు : టీ ఏఏజీ

Webdunia
గురువారం, 2 జులై 2015 (15:00 IST)
ఓటుకు నోటు కేసులో బెయిలుపై విడుదలైన ప్రధాననిందితుడు రేవంత్ రెడ్డి ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రినే అంతుచూస్తానని బెదిరించారని, అందువల్ల ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, ఈ కారణంగా రేవంత్ బెయిల్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్ ఒక పిటీషన్‌ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై శుక్రవారం విచారణ జరిగే అవకాశం ఉంది. 
 
రేవంత్ రెడ్డి బెయిల్ పిటీషన్‌ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) గురువారం ఉదయం సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. బెయిల్‌పై విడుదలైన రేవంత్ రెడ్డి సాక్షాత్తు సీఎం కేసీఆర్‌నే అంతుచూస్తానని బెదిరిస్తున్నారని ఆయన సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బెయిల్ రాగానే రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చూస్తే, కేసులో సాక్ష్యాధారాలను తారుమారు చేయడని గ్యారెంటీ ఏమిటని ఏఏజీ కోర్టుకు ఫిర్యాదు చేశారు. 
 
కాగా, బుధవారం చర్లపల్లి జైలు నుంచి రేవంత్ రెడ్డి బెయిల్‌పై విడుదలయ్యాక కార్యకర్తలు, అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌పైనే కాకుండా, తెలంగాణ మంత్రులపైనా పరుష పదజాలంతో విమర్శలు గుప్పించారు. సదరు వ్యాఖ్యలకు సంబంధించి ఆడియో, వీడియో టేపులను కూడా ఈ బెయిల్ పిటీషన్‌కు జతచేసి, బెయిల్‌ను రద్దు చేయాలని కోరడంతో మళ్లీ ఉత్కంఠత నెలకొంది. 

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments