Webdunia - Bharat's app for daily news and videos

Install App

భద్రాద్రి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు కూలీల దుర్మరణం

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (13:42 IST)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాలీని బొగ్గు టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని చండ్రుగొండు మండలంలోని సుజాత నగర్‌కు చెందిన పలువురు కూలీలు అన్నపరెడ్డి పల్లి మండలానికి వరినారు తీసేందుకు ఒక బొలెరో వాహనంలో బయలుదేరారు. 
 
ఆ సమయంలో తిప్పనపల్లి వద్ద ఈ వాహనం వెళుతుండగా ఎదురుగా బొగ్గు లోడుతో వచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనం ముందుభాగం బాగాదెబ్బతిన్నది. దీంతో ముందు భాగంలో కూర్చొన్న కూలీల్లో ఇద్దరు మహిళా కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన ఆస్పత్రికి తరలిస్తుండగా, మరో ఇద్దరు మార్గమద్యంలో చనిపోయారు. 
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని  సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments