Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణహిత నదిలో శవాలుగా తేలిన తల్లీకుమార్తె.. బావిలో తండ్రి మృతదేహం

Webdunia
శుక్రవారం, 13 నవంబరు 2020 (13:21 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కొమరంభీమ్ జిల్లాలో ఓ విషాదకర సంఘటన ఒకటి జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇందులో తల్లీ కుమార్తెలు కలిసి ప్రాణహిత నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటే, తండ్రి మాత్రం బావిలో దూకి చనిపోయాడు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని చింతలమానెపల్లి మండలం బూరపెల్లికి భార్యాభర్తలు తమ కుమార్తెతో కలిసి జీవిస్తున్నారు. వీరిలో తల్లీ కుమార్తె శుక్రవారం ఉదయం ప్రాణహిత నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. 
 
భార్య, కూతురి మృతి వార్త విన్న భర్త… అది జీర్ణించుకోలేక ఇంటివద్ద ఉన్న బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు… ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్టు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments