Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల.. జగిత్యాల ఫస్ట్ - హైదరాబాద్ లాస్ట్

Webdunia
సోమవారం, 13 మే 2019 (12:39 IST)
తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం ఉదయం సచివాలయం డీబ్లాక్‌ సమావేశ మందిరంలో విద్యాశాఖ కార్యదర్శి జనార్దనన్‌రెడ్డి ఫలితాలను విడుదల చేశారు.


రాష్ట్రవ్యాప్తంగా 4374 పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి వెల్లడించారు. 98.78 శాతం ఉత్తీర్ణతతో బీసీ గురుకుల పాఠశాలలు అత్యుత్తమంగా నిలిచాయి.
 
జూన్‌ 10 నుంచి 24 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు జనార్దన్‌రెడ్డి ప్రకటించారు. పరీక్ష రుసుం చెల్లించేందుకు మే 27వ తేదీ తుది గడువు అని వెల్లడించారు.

ఇటీవల ఇంటర్‌ ఫలితాల్లో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో పదో తరగతి ఫలితాల విషయంలో ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఈ నేపథ్యంలో పదో తరగతి ఫలితాలు 13వ తేదీ విడుదలయ్యాయి. 
 
తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఐదు లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 92.43 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 93.68 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించగా.. బాలుర ఉత్తీర్ణత శాతం 91.18గా ఉంది. ఇక 99.30 శాతం ఉత్తీర్ణతతో జగిత్యాల జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఇక చివరిస్థానంలో 89.09 శాతంతో హైదరాబాద్‌ నిలిచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments