Webdunia - Bharat's app for daily news and videos

Install App

హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ నేడే..

Webdunia
శనివారం, 30 అక్టోబరు 2021 (09:13 IST)
హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ జరుగుతోంది. ఇటు అధికార టీఆర్ఎస్.. అటు జాతీయ పార్టీ బీజేపీలు. అందుకే ఈ ఎన్నికను రెండు పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా ఈటల రాజకీయ భవితవ్యానికి కూడా ఈ ఎన్నిక ఫలితం కీలకం కానుంది. రాబోయే ఎన్నికలకు దీన్ని సెమీఫైనల్‌గా భావిస్తున్నాయి
 
ఇవాళ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. మొత్తం 306 పోలింగ్‌ స్టేషన్లలో 2,37,022 మంది ఓటర్లు తమ తీర్పును వెలువరించనున్నారు. టీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీ అభ్య ర్థిగా బరిలోకి దిగిన ఈటల రాజేందర్‌కు, అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఈ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.
 
దాదాపు ఐదునెలలుగా హోరాహోరీగా ప్రచారం సాగింది. ఆత్మగౌరవం పేరుతో ఈటల, అభివృద్ధి పేరుతో టీఆర్‌ఎస్‌ నువ్వా-నేనా అన్న స్థాయిలో జనాలకు చేరవయ్యే ప్రయత్నం చేశాయి. బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీల నేతలు పలువురు హుజురాబాద్‌లోనే మకాం వేసి ప్రచా రం నిర్వహించారు. ఈ ఉప ఎన్నిక ఫలితంపై తెలంగాణే కాదు, పొరుగు రాష్ట్రమైన ఏపీలోనూ రూ. కోట్ల మొత్తంలో పందేలు కాస్తుండటం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప 2 కలెక్షన్స్ రూ. 1850 కోట్లు వచ్చాయా? లెక్కలేవీ అని ఐటీ అడిగిందా?

హాసం రాజా ఆపాతమధురం -2 పుస్తకావిష్కరణ

విశ్వక్సేన్, లైలా సెకండ్ సింగిల్ ఇచ్చుకుందాం బేబీ రాబోతుంది

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో సత్యరాజ్, ఉదయ భాను చిత్రం బార్భరిక్

ఒక పథకం ప్రకారం..లో విలన్ ఎవరో చెబితే 10 వేలు ఇస్తాం - సాయిరాం శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ బాదం తినడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు

Golden Milk: గోల్డెన్ మిల్క్ హెల్త్ బెనిఫిట్స్

అంజీర్ పండ్లు అద్భుత ప్రయోజనాలు

కర్నూలుకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఫెర్టిలిటీ కేర్‌ను తీసుకువచ్చిన ఫెర్టీ9

భారతదేశంలో డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్ సెంటర్‌: లీసెస్టర్ విశ్వవిద్యాలయంతో అపోలో భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments