Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే పనితీరు భేష్.. జారిపోయిన చెప్పును అప్పగించిన సిబ్బంది...

Webdunia
సోమవారం, 3 ఏప్రియల్ 2023 (14:57 IST)
ఇటీవలి కాలంలో రైల్వే శాఖ పనితీరు గణనీయంగా మెరుగుపడుతుంది. ముఖ్యంగా, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు రైల్వే శాఖ అధికారులు తమ వంతు కృషి చేస్తున్నారు. తాజాగా రైలు ఎక్కుతుండగా, జారిపడిపోయిన చెప్పును తిరిగి ప్రయాణికుడికి అప్పగించారు. ఈ ఆసక్తికర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జనగామ జిల్లా చిలుపూరు మండలం, పల్లగుట్టకు చెందిన రాజేష్‌ (25) అనే యువకుడు శనివారం సికింద్రాబాద్‌ వెళ్లడానికి స్టేషన్‌‌ఘణపురం రైల్వేస్టేషన్‌కు వచ్చారు. కదులుతున్న రైలు ఎక్కుతుండగా తన కాలికి ఉన్న ఒక చెప్పు జారి రైలు పట్టాల మధ్యలో పడింది. 
 
'చెప్పులు కొత్తవి. నాకు చాలా ఇష్టమైనవని...' అంటూ రైల్వే అధికారులకు ట్వీట్‌ చేశారు. దీంతో సికింద్రాబాద్‌ డివిజనల్‌ భద్రతాధికారి దేబాస్మిత స్పందించి కాజీపేట ఆర్పీఎఫ్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ ఆ విద్యార్థి చెప్పును కాజీపేటకు తీసుకువచ్చి ఆదివారం రాజేష్‌కు అప్పగించారు. ఈ వార్త కాస్త వినడానికి కొంత వింతగా ఉన్నా.. చెప్పును కూడా రికవరీ చేయడం పోలీసుల పనితీరుకు అద్దం పడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments