Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా జోలికొస్తే చంద్రబాబును చీరేస్తా : తలసాని శ్రీనివాస్ వార్నింగ్

Webdunia
గురువారం, 30 అక్టోబరు 2014 (11:41 IST)
తెలుగుదేశం పార్టీలో తనకు అన్యాయం జరగడం వల్లే తాను ఆ పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరినట్టు హైదరాబాద్ సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోమారు పునరుద్ఘాటించారు. అయితే, పార్టీ మారడం వల్ల తనపై టీడీపీ నేతలు లేదా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవాకులు చవాకులు పేలితో మాత్రం వారి బండారం బయటపెడతానని ఆయన హెచ్చరించారు. 
 
బుధవారం సాయంత్రం తలసాని శ్రీనివాస్ యాదవ్‌, తీగల కృష్ణారెడ్డి, మరో ఎమ్మెల్సీ తెరాసలో చేరిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా అమీర్ పేటలో జరిగిన బహిరంగ సభలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రసంగిస్తూ కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లోకి వెళుతున్నారని తెలిసి... వారిని పర్సనల్‌గా పిలిపించుకుని, మీకేం కావాలి? మీ పిల్లలకేం కావాలి? అంటూ అనేక రకాలుగా చంద్రబాబు తమను ప్రలోభపెట్టారని ఆయన ఆరోపించారు. 
 
తెలుగుదేశం పార్టీ పూర్తిగా కాంట్రాక్టర్ల చేతుల్లోకి వెళ్లిపోయిందని విమర్శించారు. చంద్రబాబును ఉద్దేశించి ‘బిడ్డా! మరో జన్మ ఎత్తినా తెలంగాణలో టీడీపీ ప్రభుత్వం రాదు. హైదరాబాద్‌ మాది. మా తడాఖా చూపిస్తాం’ అంటూ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టువదలని విక్రమార్కుడిలా పాటుపడుతున్నారని ప్రశంసించారు. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే తాను టీఆర్‌ఎస్‌లోకి చేరుతున్నానని తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. 

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments