ఆక‌లితో అల‌మ‌టించొద్దు... సీఎం కేసీయార్ లక్ష్య‌మిది!

Webdunia
సోమవారం, 26 జులై 2021 (18:29 IST)
తెలంగాణా రాష్ట్రంలో ఏ ఒక్కరు ఆక‌లితో అలమటించకూడదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లక్ష్యంగా పెట్టుకున్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  తెలిపారు.

సోమవారం బేగంపేట లోని జురాస్టియాన్ క్లబ్ లో కొత్త తెల్లరేషన్ కార్డులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదప్రజలకు నిత్యావసర సరుకులను సబ్సిడీ పై అందించే తెల్లరేషన్ కార్డుల పంపిణీ ని రాష్ట్రవ్యాప్తంగా నేటినుండి ప్రారంభిస్తున్నట్లు వివరించారు.

హైదరాబాద్ జిల్లా పరిధిలో ప్రస్తుతం 5,85, 756 తెల్లరేషన్ కార్డ్ లు ఉన్నాయని, వీటి ద్వారా 21,90,034 మంది లబ్ది పొందుతున్నారని అన్నారు. నూతనంగాఅర్హత పొందిన 56, 064 తెల్లరేషన్ కార్డ్ లను లబ్దిదారులకు పంపిణీ చేయడం జరుగుతుందని, వీటి ద్వారా 2.25 లక్షల మందికి లబ్దిచేకూరుతుందని  మంత్రి శ్రీనివాస్ యాదవ్ వివరించారు.

కొత్తగా కార్డులు పంపిణీ చేసిన వారికి ఆగస్టు నెల నుండే రేషన్ పంపిణీ చేయడం జరుగుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, కాలేరు వెంకటేష్, ఆర్డీవో వసంత, డిప్యూటీ మేయర్ శ్రీలత, కార్పొరేటర్ లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ వీరాభిమానిని - ఆ సినిమాకు జరిగినట్టు మరో చిత్రానికి జరగరాదు : సుధా కొంగరా

Dulquer Salmaan : ఆకాశంలో ఒక తార చిత్రం నుంచి సాత్విక వీరవల్లి పరిచయం

Sukumar: జపనీస్ అభిమానుల ప్రేమలేఖలతో చలించిపోయిన సుకుమార్

Varun Tej: కొరియన్ కనకరాజు గా వరుణ్ తేజ్ వచ్చేసినాడమ్మీ

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మనస్సును హత్తుకున్నాయి.. అందుకే ఆ పని చేశాం : నవీన్ పోలిశెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో లేయర్స్ ప్రైవ్‌ను ప్రారంభించిన లేయర్స్ క్లినిక్స్

క్యాన్సర్ అవగాహనకు మద్దతుగా 2026 ముంబయి మారథాన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరివర్తన్

పురుషుల కంటే మహిళలు చలికి వణికిపోతారు, ఎందుకని?

గుండెకి ఈ పండ్లు ఆరోగ్యం

అల్పాహారం, ఒత్తిడి, రాత్రిపూట నిద్ర... మధుమేహంతో లింక్

తర్వాతి కథనం
Show comments