Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆక‌లితో అల‌మ‌టించొద్దు... సీఎం కేసీయార్ లక్ష్య‌మిది!

Webdunia
సోమవారం, 26 జులై 2021 (18:29 IST)
తెలంగాణా రాష్ట్రంలో ఏ ఒక్కరు ఆక‌లితో అలమటించకూడదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లక్ష్యంగా పెట్టుకున్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  తెలిపారు.

సోమవారం బేగంపేట లోని జురాస్టియాన్ క్లబ్ లో కొత్త తెల్లరేషన్ కార్డులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదప్రజలకు నిత్యావసర సరుకులను సబ్సిడీ పై అందించే తెల్లరేషన్ కార్డుల పంపిణీ ని రాష్ట్రవ్యాప్తంగా నేటినుండి ప్రారంభిస్తున్నట్లు వివరించారు.

హైదరాబాద్ జిల్లా పరిధిలో ప్రస్తుతం 5,85, 756 తెల్లరేషన్ కార్డ్ లు ఉన్నాయని, వీటి ద్వారా 21,90,034 మంది లబ్ది పొందుతున్నారని అన్నారు. నూతనంగాఅర్హత పొందిన 56, 064 తెల్లరేషన్ కార్డ్ లను లబ్దిదారులకు పంపిణీ చేయడం జరుగుతుందని, వీటి ద్వారా 2.25 లక్షల మందికి లబ్దిచేకూరుతుందని  మంత్రి శ్రీనివాస్ యాదవ్ వివరించారు.

కొత్తగా కార్డులు పంపిణీ చేసిన వారికి ఆగస్టు నెల నుండే రేషన్ పంపిణీ చేయడం జరుగుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, కాలేరు వెంకటేష్, ఆర్డీవో వసంత, డిప్యూటీ మేయర్ శ్రీలత, కార్పొరేటర్ లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments