ఆక‌లితో అల‌మ‌టించొద్దు... సీఎం కేసీయార్ లక్ష్య‌మిది!

Webdunia
సోమవారం, 26 జులై 2021 (18:29 IST)
తెలంగాణా రాష్ట్రంలో ఏ ఒక్కరు ఆక‌లితో అలమటించకూడదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లక్ష్యంగా పెట్టుకున్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  తెలిపారు.

సోమవారం బేగంపేట లోని జురాస్టియాన్ క్లబ్ లో కొత్త తెల్లరేషన్ కార్డులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదప్రజలకు నిత్యావసర సరుకులను సబ్సిడీ పై అందించే తెల్లరేషన్ కార్డుల పంపిణీ ని రాష్ట్రవ్యాప్తంగా నేటినుండి ప్రారంభిస్తున్నట్లు వివరించారు.

హైదరాబాద్ జిల్లా పరిధిలో ప్రస్తుతం 5,85, 756 తెల్లరేషన్ కార్డ్ లు ఉన్నాయని, వీటి ద్వారా 21,90,034 మంది లబ్ది పొందుతున్నారని అన్నారు. నూతనంగాఅర్హత పొందిన 56, 064 తెల్లరేషన్ కార్డ్ లను లబ్దిదారులకు పంపిణీ చేయడం జరుగుతుందని, వీటి ద్వారా 2.25 లక్షల మందికి లబ్దిచేకూరుతుందని  మంత్రి శ్రీనివాస్ యాదవ్ వివరించారు.

కొత్తగా కార్డులు పంపిణీ చేసిన వారికి ఆగస్టు నెల నుండే రేషన్ పంపిణీ చేయడం జరుగుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, కాలేరు వెంకటేష్, ఆర్డీవో వసంత, డిప్యూటీ మేయర్ శ్రీలత, కార్పొరేటర్ లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nattikumar: తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రజాస్వామ్య పద్ధతులు లేకుండానే కొనసాగుతోంది

ఎగ్జిబిటర్ల సమస్యల పరిష్కారినికి సిద్ధం - దానితోపాటు నిర్మాతల సమస్య లూ పరిష్కారం కావాలి

Nag Ashwin: రుత్విక్ కి రాజా ది రాజా జస్ట్ బిగినింగ్ మాత్రమే : నాగ్ అశ్విన్

Anil Ravipudi: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన శ్రీనివాస మంగపురం లోని మంగా మంగా సాంగ్

మరో గ్లోబల్ రికార్డ్ క్రియేట్ చేసిన విరోష్ జోడి.. కపుల్ యాడ్ కు 9.1 మిలియన్ లైక్స్

తర్వాతి కథనం
Show comments