Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ ''పెద్దలు జానా...'' సభలో నవ్వులు... లేచెళ్లిపోయిన ఉత్తమ్, భట్టి

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2015 (21:47 IST)
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు అని చెప్పుకునే జానారెడ్డి తీరు టి.కాంగ్రెస్ కు మింగుడుపడటం లేదట. రైతుల ఆత్మహత్యలపై విపక్షాలన్నీ కలిసి అధికార పక్షంపై దాడి చేస్తుంటే జానారెడ్డి మాత్రం మెత్తగా మాట్లాడుతున్నారట. ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో మాట్లాడుతూ... పెద్దలు జానారెడ్డి అని అనగానే అప్పటివరకూ ప్రభుత్వ వైఖరిని నిగ్గు తేల్చాలని కంకణం కట్టుకున్నట్లుండే జానా... ఆ మాటకే ఐస్ అయిపోతున్నారట. 
 
ఏమీ మాట్లాడుకుండా సుతిమెత్తగా మాట్లాడుతూ ఉండటంతో కాంగ్రెస్ పార్టీ మైలేజీ రోజురోజుకీ పడిపోతోందట. దీనిపై ఆ పార్టీకి చెందిన నేతలే తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారని సమాచారం. మొన్న సభలో కేసీఆర్ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ అసెంబ్లీలో నిరసన చేపట్టాలని అందరూ నిర్ణయానికి వస్తే.. జానా మాత్రం అందుకు ససేమిరా అన్నారట. చివరికి ఒత్తిడి తెచ్చేసరికి సరేనని ఒప్పుకున్నారట. 
 
తాజాగా మళ్లీ సభలో సీఎం కేసీఆర్ పెద్దలు జానారెడ్డి అని జానారెడ్డిని ఉద్దేశించి సంబోధించడంతో సభలో నవ్వులు రాలాయి. మళ్లీ యధాప్రకారం జానా మెత్తగా మాట్లాడటం మొదలెట్టారట. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క ఇద్దరూ తీవ్ర అసహనానికి లోనై సభ నుంచి మధ్యలోనే వెళ్లిపోయారట. మరి జానా తీరు మారుతుందో లేదో...?!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments