Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ సస్పెన్షన్ ఎత్తివేత

Webdunia
ఆదివారం, 22 అక్టోబరు 2023 (12:20 IST)
హైదరాబాద్ నగరంలోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై భారత జనతా పార్టీ రాష్ట్ర శాఖ విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయనపై గత యేడాది ఆగస్టు 23వ తేదీన ఆయనపై సస్పెండ్ చేసారు. ఆ తర్వాత వివాదాస్పద వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని పార్టీ ఆయనను ఆదేశించింది. 
 
ఈ నేపథ్యంలో తాజాగా సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు భాజపా కేంద్ర క్రమశిక్షణ సంఘం సభ్య కార్యదర్శి ఓం పాఠక్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాజపా సస్పెన్షన్‌ ఎత్తివేయడంతో రాజాసింగ్‌కు ఊరట కలగనుంది. ఈ ఎన్నికల్లో ఆయన గోషామహల్‌ నుంచే పోటీచేసే అవకాశముంది.
 
వచ్చే నెలలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులోభాగంగా, నవంబరు 30వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో రాజసింగ్‌పై సస్పెన్షన్‌ను ఎత్తి వేయడం గమనార్హం. 
 
ఏపీ ఉద్యోగులకు దసరా కానుక.. జీవో జారీ  
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీపి కబురు చెప్పారు. డీఏ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగుల డీఏను 3.64 శాతం ఇవ్వాలని ఆయన నిర్ణయించి, ఈ మేరకు ఉత్తర్వులు జారీచేయించారు. ఈ డీఏను 2022 జూలై ఒకటో తేదీ నుంచి అందజేయనున్నారు.
 
ఉద్యోగుల సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేసిన ప్రకటన మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఉద్యోగులకు డీఏను 3.64 శాతం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ డీఏను 2022 జూలై ఒకటో తేదీ నుంచి అమలు చేస్తున్నారు. 
 
ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని ఉద్యోగుల సంఘం నేతలు కలిసి డీఏ విడుదల చేయాలని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు. ఆగస్టు 2వ తేదీన విజయవాడలో జరిగిన ఏపీఎన్జీవో రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో సీఎం జగన్ డీఏ ఇస్తామని ప్రకటించారు. దీన్ని దసరా పండుగకు రెండు రోజుల ముందుగానే విడుదల చేసేలా చర్యలు తీసుకున్నారు. 
 
పండగ పూట ఉల్లిఘాటు... లబోదిబోమంటున్న సామాన్య ప్రజలు 
 
మొన్నటివరకు టమోటా ధరలు ఆకాశాన్ని తాకాయి. ఒక కేజీ టమోటాలు ఏకంగా రూ.400 వరకు పలికాయి. ఆ తర్వాత దిగుబడి పెరగడంతో టమోటా ధరలు క్రమంగా కిందకు దిగివచ్చాయి. ఇపుడు పండుగ వేళ ఉల్లిఘాటు నషాళానికి తాకుతుంది. వీటి ధరలు ఒక్కసారిగా పెరిగిపోయింది. నిన్నామొన్నటివరకు కాస్త తక్కువగా ఉన్న వీటి ధరలు ఇపుడు మార్కెట్‌లో రూ.45 నుంచి రూ.50 వరకు చేరుకున్నాయి. దీంతో కూరగాయలు, నిత్యావసర ధరలు మరోమారు పెరుగిపోతున్నాయని సామాన్య ప్రజలు లబోదిబోమంటున్నారు. 
 
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. కర్ణాటకలోని రానుల్, బళ్లారి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి ఉల్లి సరఫరా అవుతుంటుంది. అయితే ఈసారి రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో ఉల్లి ఉత్పత్తిపై ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 
 
మరోవైపు కొత్త దిగుబతి ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో ధరల పెరుగుదలకు కారణమవుతోంది. విశాఖపట్నంలో కేజీ ఉల్లి రూ.50 పలుకుతోంది. ఇక రైతుబజార్లో రూ.40గా ఉంది. కర్ణాటకలో ఉల్లి అందుబాటులో లేకపోవడంతో మహారాష్ట్ర నుంచి వ్యాపారులు కొనుగోలు చేయాల్సి వస్తుండడం కూడా ఒక కారణంగా ఉంది. కాగా కొత్త ఉల్లి నవంబర్ నెలలో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. అప్పటివరకు ఉల్లి ధరల ఘాటును సామాన్యులు భరించడం తప్పేలా కనిపించడం లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను OG అంటే మీరు క్యాజీ అంటే నేనేం చేయాలి: పవన్ కల్యాణ్ (video)

35-చిన్న కథ కాదు'- మనందరి కథ : హీరో రానా దగ్గుబాటి

సుహాస్ హీరోగా కోర్టు డ్రామా జనక అయితే గనక.. ఫస్ట్ లుక్

పేక మేడలు సినిమా నుంచి సెకండ్ సింగిల్ ఆడపిల్ల .. విడుదల

వెంకటేష్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ లెంట్ వైఫ్ పాత్రల చుట్టూ తిరిగే కథే వెంకీ మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments