Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను చంపిన స్వాతి జైల్లో యోగా చేస్తోందట...

ప్రియుడు శారీరక సుఖానికి అలవాటుపడి కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా కడతేర్చిన భార్య స్వాతి ఇపుడు జైల్లో ఊచలు లెక్కిస్తోంది. ఈమె ప్రస్తుతం జైలు జీవితం గడుపుతూ ఎలాంటి ఆందోళన లేకుండా యోగా చేస్తోందట.

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2017 (12:19 IST)
ప్రియుడు ఇచ్చే శారీరక సుఖానికి అలవాటుపడి కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా కడతేర్చిన భార్య స్వాతి ఇపుడు జైల్లో ఊచలు లెక్కిస్తోంది. ఈమె ప్రస్తుతం జైలు జీవితం గడుపుతూ ఎలాంటి ఆందోళన లేకుండా యోగా చేస్తోందట. ఆమెను చూసిన జైలు సిబ్బందే ఆశ్చర్యపోతున్నారట. 
 
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన తన భర్త అయిన కాంట్రాక్టర్ సుధాకర్‌ రెడ్డిని భార్య స్వాతి తన ప్రియుడు రాజేష్‌తో కలిసి హత్య చేసిన విషయం తెల్సిందే. ఈ కేసులో రెండో నిందితురాలిగా ఉన్న స్వాతిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి జిల్లా జైలుకు తరలించారు. అక్కడ ఆమెకు 687 అనే ఖైదీ నంబరును కేటాయించారు. 
 
ఈమె ఉంటున్న లాకప్‌లో మొత్తం 13 మంది ఖైదీలు ఉన్నారు. వీరితో పాటు జైలులో ఎంలాంటి ఆందోళన లేకుండా స్వాతి గడిపినట్లు సమాచారం. పైగా, స్వాతికి యోగా చేసే అలవాటు ఉండటంతో కొంత సమయం పాటు ఆమె యోగా కూడా చేసిందట. స్వాతి చదువుకున్నందున జైలులో ఉండే నిరక్షరాస్యులకు అక్షరాలు నేర్పించమని పోలీసులు చెప్పినట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments