Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం తాగి వాహన ప్రమాదం చేస్తే కఠిన శిక్ష, పదేళ్ల జైలు లేదా యావజ్జీవం: సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌

Webdunia
శనివారం, 14 నవంబరు 2020 (22:54 IST)
అతిగా మద్యం తాగి, మితిమీరిన వేగంతో వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు పాల్పడితే.. ఇకపై డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసుతో సరిపెట్టబోమని, కఠినంగా వ్యవహరిస్తామని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ హెచ్చరించారు. ఇలాంటి వారిపై ఐపీసీ 304-ఎ సెక్షన్‌ కింద కేసు నమోదు చేస్తామని, పదేళ్ల జైలు లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడేలా కోర్టుల్లో సాక్ష్యాధారాలను సమర్పిస్తామని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
 
ఇటీవల శంషాబాద్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, మియాపూర్‌ ప్రాంతాలతో పాటు బాహ్యవలయ రహదారులపై మద్యం మత్తులో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు. ఈ తరహా ప్రమాదాలను నియంత్రించేందుకు ప్రత్యేక బృందాలను నియమించామని, రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం వరకూ ఈ బృందాలు విధులు నిర్వర్తిస్తాయని తెలిపారు. 
 
మహబూబ్‌నగర్‌, మెదక్‌, సిద్దిపేట, బీదర్‌లతో పాటు హైదరాబాద్‌ శివారుల్లో ఉన్న మద్యం దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు, పబ్‌ల్లో మద్యం తాగి మాదాపూర్‌, సైబర్‌ టవర్స్‌, గచ్చిబౌలి ప్రాంతాలకు లాంగ్‌డ్రైవ్‌కు వస్తున్నట్లు గుర్తించామన్నారు. మద్యం మత్తులో వాహనం ఎవరు నడిపినా.. అసలు యజమానిపైనా కేసు నమోదు చేస్తామని సజ్జనార్‌ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

కలర్ ఫొటో, బేబి మేకర్స్ కొత్త సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments