Webdunia - Bharat's app for daily news and videos

Install App

శాశ్వతనిద్రలోకి జారుకున్న పౌర హక్కుల నేత ఎంటీ ఖాన్!

Webdunia
గురువారం, 21 ఆగస్టు 2014 (09:47 IST)
పౌర హక్కుల సంఘం మాజీ అధ్యక్షుడు, సీనియర్ పాత్రికేయులు, మహ్మద్ తాజుద్దీన్ ఖాన్ అలియాస్ ఎంటీ ఖాన్ బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఎంటి ఖాన్‌గా ప్రసిద్ధుడైన ఆయన హైదరాబాదులోని చార్మినార్ పూరానాపూల్ దర్వాజాలోని తన ఇంట్లో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈయనకు వయస్సు 89 యేళ్లు. 
 
స్థానిక మూసాఖాద్రీ దర్గాలో బుధవారం రాత్రి ఎంటి ఖాన్ అంత్యక్రియలు పూర్తి చేశారు. ఖాన్ యువకుడిగా ఉన్నప్పుడు రాజకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆయన కొంతకాలం కోట్ల అలిజా ధర్మవంత్ విద్యా సంస్థలో పాఠాలు కూడా బోధించారు. ఆ తర్వాత సియాసత్, ఈనాడు గ్రూప్‌నకు చెందిన న్యూస్ టైమ్ దినపత్రికల్లో జర్నలిస్టుగా పనిచేశారు. ఎంటీ ఖాన్ మృతిపట్ల పౌర హక్కుల నేతలు, గద్దర్, కోదండరాం వంటి నేతలు సంతాపం వ్యక్తం చేశారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments