Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రం లీక్ కేసు - 40 మందికి సిట్ నోటీసులు

Webdunia
గురువారం, 23 మార్చి 2023 (08:39 IST)
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) నిర్వహించిన గ్రూపు-1 పోటీ పరీక్షల ప్రశ్నపత్రం లీకేజీ కేసును ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరుపుతుంది. ఇప్పటికే ఈ లీకేజీకి ప్రధాన సూత్రధారులుగా భావిస్తున్న వారిలో తొమ్మిది మందిని అరెస్టు చేసింది. అయితే, లీక్ కేసులోని నిందితురాలు రేణుక కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేపట్టి 40 మంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిబ్బందికి సిట్ నోటీసులు జారీచేసింది. వారిలో ఇప్పటికే పది మందికి గ్రూపు-1 పోటీ పరీక్షలు రాసినట్టు తేలింది. గ్రూపు-1 పరీక్షలు రాసినవారితోపాటు పలువురు మిగతా ఉద్యోగులకు కూడా ఈ నోటీసులు జారీచేసింది. 
 
కాగా, లీక్ కేసులో నిందితురాలు రేణుకకు కోచింగ్ సెంటర్లతో కూడా సంబంధాలు ఉన్నట్టు సిట్ అనుమానిస్తుంది. ప్రశ్నపత్రం గురించి ఉద్యోగ అభ్యర్థులతో రేణుక, ఆమె భర్త డాక్యా నాయక్‌ మాట్లాడినట్టు సిట్ అధికారులు గట్టిగా నమ్ముతున్నారు. దీంతో రేణుక కాల్ డేటా ఇపుడు కీలకంగా మారింది. రేణుకతో మాట్లాడిన కోచింగ్ సెంటర్ల నిర్వాహకులకు కూడా నోటీసులు ఇవ్వాలని సిట్ భావిస్తుంది. దీంతో ఈ పేపర్ లీకేజీ కేసు ఎన్నో మలుపులు తిరుగుతూ ఆసక్తిగా సాగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Virgin: ఫోన్ల వర్షం - కానుకల వర్షంతో ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్న వర్జిన్ బాయ్స్ టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments