Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రం లీక్ కేసు - 40 మందికి సిట్ నోటీసులు

Webdunia
గురువారం, 23 మార్చి 2023 (08:39 IST)
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) నిర్వహించిన గ్రూపు-1 పోటీ పరీక్షల ప్రశ్నపత్రం లీకేజీ కేసును ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరుపుతుంది. ఇప్పటికే ఈ లీకేజీకి ప్రధాన సూత్రధారులుగా భావిస్తున్న వారిలో తొమ్మిది మందిని అరెస్టు చేసింది. అయితే, లీక్ కేసులోని నిందితురాలు రేణుక కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేపట్టి 40 మంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిబ్బందికి సిట్ నోటీసులు జారీచేసింది. వారిలో ఇప్పటికే పది మందికి గ్రూపు-1 పోటీ పరీక్షలు రాసినట్టు తేలింది. గ్రూపు-1 పరీక్షలు రాసినవారితోపాటు పలువురు మిగతా ఉద్యోగులకు కూడా ఈ నోటీసులు జారీచేసింది. 
 
కాగా, లీక్ కేసులో నిందితురాలు రేణుకకు కోచింగ్ సెంటర్లతో కూడా సంబంధాలు ఉన్నట్టు సిట్ అనుమానిస్తుంది. ప్రశ్నపత్రం గురించి ఉద్యోగ అభ్యర్థులతో రేణుక, ఆమె భర్త డాక్యా నాయక్‌ మాట్లాడినట్టు సిట్ అధికారులు గట్టిగా నమ్ముతున్నారు. దీంతో రేణుక కాల్ డేటా ఇపుడు కీలకంగా మారింది. రేణుకతో మాట్లాడిన కోచింగ్ సెంటర్ల నిర్వాహకులకు కూడా నోటీసులు ఇవ్వాలని సిట్ భావిస్తుంది. దీంతో ఈ పేపర్ లీకేజీ కేసు ఎన్నో మలుపులు తిరుగుతూ ఆసక్తిగా సాగుతుంది. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments