Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నారు : శంకర్రావు ఫైర్

Webdunia
గురువారం, 29 జనవరి 2015 (14:09 IST)
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేస్తున్నారంటూ ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి పి శంకర్రావు మండిపడ్డారు. ఇదే అంశంపై ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని సొంత పార్టీ వారే సర్వనాశనం చేశారన్నారు. ఇంకా వారే కీలక పార్టీ పదవుల్లో కొనసాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
అలాంటి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే తప్పా పార్టీకి భవిష్యత్తు లేదని తేల్చి చెప్పారు. తనతోపాటు గతంలో మంత్రులుగా పని చేసిన వారిపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును డిమాండ్ చేశారు. అవినీతి ఆరోపణల వల్లే కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా ఓడిపోయిందని పి శంకర్రావు మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
 
హైదరాబాద్ బస్తీలో పక్కా ఇళ్లు ఇప్పిస్తామంటూ పేదల నుంచి కొందరు దళారులు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. తెలంగాణ సర్కారు పేరుతో దరఖాస్తులు అమ్ముతున్నారని దీనిపై విచారణ జరిపించాలని ఆయనతో పాటు.. పలువురు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. 

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments