Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌కు వాస్తు పిచ్చి పట్టింది.. ఆయన్నే మార్చేయాలి : షబ్బీర్ అలీ

Webdunia
శనివారం, 31 జనవరి 2015 (19:26 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వాస్తు పిచ్చి పట్టిందని, అందువల్ల ఆయన్నే మార్చేయాలని టీ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌కు రోజుకో కొత్త విధానం తాజాగా ఆయన కన్ను సెక్రెటేరియట్‌ మీదపై పడిందన్నారు. 
 
తెలంగాణ ఏమైనా కేసీఆర్‌ సొంత జాగీరా అని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రికి వాస్తు పిచ్చి పట్టిందని, పదవి నుంచి ఆయన్నే తొలగిస్తే వాస్తు బాగుంటుందని షబ్బీర్‌ అలీ వ్యాఖ్యానించారు.
 
అంతేకాకుండా, తెలంగాణ రాష్ట్రం కోసం మొక్కిన మొక్కులు చెల్లించేందుకే ఎనిమిది నెలలు పడితే, ప్రజలకు ఇచ్చిన లెక్కలేనన్ని హామీలు నెరవేర్చేందుకు ఎంత కాలం కావాలని ప్రశ్నించారు. ఎర్రగడ్డ ఛెస్ట్ ఆసుపత్రిని తరలిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. 
 
ఫాస్ట్ పథకం అంటూ ఇంతకాలం తెలంగాణలోని విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుని, ఇప్పుడు వాస్తు పేరిట తెలంగాణ ఖజానా ఖాళీ చేస్తావా? అని ఆయన నిలదీశారు. ఇంతకాలం సచివాలయంలో పాలన జరగలేదా?, పదేళ్లు ఆగితే ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఖాళీ కాదా? అని ఆయన ప్రశ్నించారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments