Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసు, పోలీసు కస్టడిలోకి నిందితులు

Webdunia
శనివారం, 26 సెప్టెంబరు 2020 (13:29 IST)
సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో నిందితులను పోలీసు కస్టడీకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు ఇద్దరు నిందితులైన సాయికృష్ణ, దేవరాజ్‌ను మూడురోజుల పాటు కస్టడిలోనికి తీసుకున్నారు.
 
వారి నుంచి ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టేందుకు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు ఎస్ఆర్ నగర్ పోలీసులు. ప్రేమిస్తున్నట్లు నటించి శ్రావణిని బ్లాక్‌మెయిల్ చేసి తీవ్రంగా వేధింపులకు గురిచేసి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారనే ఆరోపణలతో దేవరాజ్ రెడ్డి, సాయికృష్ణ రెడ్డితో పాటు సినీ నిర్మాత అశోక్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.
 
శ్రావణి ఆత్మహత్యకు ముందు శ్రీకన్య హోటల్లో సాయి, దేవరాజ్, శ్రావణి మధ్య గొడవ జరిగింది. ఆత్మహత్యకు ముందు ముగ్గురి సెల్ సిగ్నల్స్ ఆధారంగా విచారణ చేపట్టనున్నారు. ప్రేమ పేరుతో శ్రావణిని సాయి, దేవరాజ్ మోసం చేశారు. ఈ కేసులో లభించిన ఆడియోలు, వీడియోల ఆధారంగా పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments