Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేతల తీరు మారలేదు.. శిక్ష తప్పదు : నా కాసులు ఎక్కడంటూ ఉజ్జయినీ మహంకాళి ప్రశ్న

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2015 (12:58 IST)
కొత్త రాష్ట్రం వచ్చినా కొంతమంది నేతల తీరు మారడం లేదనీ, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారు స్వర్ణలత రూపంలో చెప్పింది. ఈ ఆలయ వేడుకల్లో భాగంగా రంగం కార్యక్రమం సోమవారం జరిగింది. ఇందులో పచ్చికుండపై మహంకాళి పూనిన స్వర్ణలత నిలబడి భవిష్యవాణిని వినిపించింది.
 
తప్పులు చేసిన అందరికీ తప్పకుండా శిక్ష పడుతుందని రంగంలో అమ్మవారు హెచ్చరించింది. రాష్ట్రం వచ్చినా నా గురించి ఆలోచించరేమని రంగంలో అమ్మవారు ప్రశ్నించింది. కొత్త రాష్ట్రం వచ్చినా కొందరు నేతలు ప్రవర్తన మార్చుకోలేదని చెప్పింది. ఎన్ని కష్టాలు వచ్చినా భక్తులు నాకు పూజలు చేస్తున్నారని, అలాగే ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరింది. 
 
అంతేకాకుండా, ఆలయ అభివృద్ధి జరగడం లేదని, కాసులు ఎంతమాత్రమూ రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, "నా కాసులెక్కడరా?" అని ప్రశ్నించింది. తాను కళ్లు మూసుకుని చూసీ చూడనట్టు జీవిస్తున్నానని గతంలో పావలా, అర్థరూపాయి కానుకలు వచ్చినా, ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. రాబడి పెరుగుతూ ఉంటే, ఎవరికి వారు దోచుకుందామని చూస్తున్నారని అన్నారు. తన కాసులను కాజేయాలని చూస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments