Webdunia - Bharat's app for daily news and videos

Install App

చర్లపల్లి వరకు వందే భారత్ రైలు... 8న ప్రారంభం

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (10:54 IST)
ఈ నెల 8వ తేదీ నుంచి సికింద్రాబాద్ - తిరుపతి ప్రాంతాల మధ్య వందే భారత్ రైలు ప్రారంభంకానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రైలుకు జెండా ఊపి రైలును ప్రారంభిస్తారు. ఈ నెల 8వ తేదీ సికింద్రాబాద్‌లోని పదో నంబరు ఫ్లాట్‌ఫాంపై ప్రధాని మోడీ రైలును ప్రారంభిస్తారు. ఇందుకోసం వందే భారత్ రైలు ఇప్పటికే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఆ తర్వాత భద్రతా సిబ్బందితో కలిసి వందే భారత్ రైలును చర్లపల్లి వరకు ట్రయల్ రన్ నిర్వహించారు. 
 
పదో నంబరు ప్లాట్‌ఫామ్‌ వద్ద ఉన్న రైల్వే లైనును శుభ్రం చేసి రంగులద్ది సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రధానమంత్రి వస్తున్న సందర్భంగా నారాయణపేట చేనేత వస్త్రదుకాణం, మిల్లెట్‌ స్టాల్‌, జ్యూట్‌, వెదురుతో తయారు చేసిన వస్తువులతో గిరిజన ఉత్పత్తులకు సంబంధించి ట్రైఫెడ్‌ దుకాణానికి అనుమతిచ్చారు.
 
మరోవైపు, ప్రధాని పర్యటన నేపథ్యంలో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుచేశారు. ఇప్పటికే రంగంలోకి దిగిన ఎస్పీజీ స్టేషన్‌ను అధీనంలోకి తీసుకుంది. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌, రైల్వే పోలీసులు, సాయుధ బెటాలియన్‌ దళాలు, స్పెషల్‌ ఫోర్స్‌ బృందాలు, లోకల్‌ లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులతో పాటు 500 మంది అధికారుల పర్యవేక్షణలో భద్రత కొనసాగనుంది.
 
సికింద్రాబాద్‌ - తిరుపతి నగరాల మధ్య రాకపోకలు సాగించనున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ మంగళవారం మినహా వారంలో ఆరు రోజులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. 3 నెలల వ్యవధిలోనే రాష్ట్రంలోని సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి రెండో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

Nagarjuna : జియో హాట్ స్టార్‌లో బిగ్ బాస్ సీజన్ 9 అగ్నిపరీక్ష

లెక్కలో 150 మంది కార్మికులు, కానీ సెట్లో 50 మందే : చిన్న నిర్మాతల బాధలు

ఆర్మీ కుటుంబాల నేపథ్యంగా మురళీ మోహన్ తో సుప్రీమ్ వారియర్స్ ప్రారంభం

శివుడు అనుగ్రహిస్తే ప్రభాస్ పెళ్లి త్వరలోనే జరుగుతుంది.. : పెద్దమ్మ శ్యామలా దేవి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments