Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ప్రభుత్వం నుంచి శశికళకు నోటీసులు... నలిపేసిన శశి

శశికళకు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. నాలుగేళ్ళ జైలుశిక్ష అనుభవించేందుకు బెంగుళూరుకు శశికళ బయలుదేరే సమయంలో తెలంగాణ రాష్ట్రం నుంచి మరో నోటీసు వచ్చింది. సికింద్రాబాద్ పరిధిలోని మారేడ్ పల్లి, రాధిక కాలనీలో శశికళ పేరిట ఒక ఇల్లు ఉండగా, ఆ ఇంటికి గత రెండేళ్

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2017 (21:46 IST)
శశికళకు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. నాలుగేళ్ళ జైలుశిక్ష అనుభవించేందుకు బెంగుళూరుకు శశికళ బయలుదేరే సమయంలో తెలంగాణ రాష్ట్రం నుంచి మరో నోటీసు వచ్చింది. సికింద్రాబాద్ పరిధిలోని మారేడ్ పల్లి, రాధిక కాలనీలో శశికళ పేరిట ఒక ఇల్లు ఉండగా, ఆ ఇంటికి గత రెండేళ్ళ నుంచి ఆస్తి పన్ను చెల్లించలేదు శశికళ. 
 
పన్ను బకాయిలను నూరు శాతం వసూలు చేయాలని సంకల్పించిన కెసీఆర్ సర్కార్ ఈ మేరకు శశికళ పేరిట నోటీసులు కూడా జారీ చేశారు. ఈ ఇంటిని 1990 ప్రాంతంలో శశికళ కొనుగోలు చేశారట. అప్పట్లో హైదరాబాద్‌కు వచ్చినప్పుడు కొంతకాలం జయలలిత ఇదే ఇంట్లోనే బస చేసేవారని స్థానికులు చెబుతున్నారు. ఆ తరువాత కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు ఈ ఇంటిని అద్దెకు ఇచ్చినప్పటి నుంచి వారు ఖాళీ చేసి వెళ్ళిన తరువాత గత నాలుగేళ్ళుగా ఈ ఇల్లు ఖాళీగానే ఉందని స్థానికులు చెబుతున్నారు.
 
శశికళ బెంగుళూరుకు బయలుదేరక ముందే ఆమెకు ఈ నోటీసులు అందాయట. దీంతో ఆమె మరింత ఆవేదన చెందుతూ ఆ నోటీసు నల్లిని నలిపినట్లు నలిపి అక్కడ పడేసి వెళ్లిపోయారట.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments