Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతి శోభ : టోల్ ప్లాజాల వద్ద బారులు తీరిన వాహనాలు

Webdunia
ఆదివారం, 12 జనవరి 2020 (14:52 IST)
సంక్రాంతిని పురస్కరించుకొని ప్రయాణీకులు తమ స్వంత ఊళ్లకు బయలుదేరారు. దీంతో టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులుతీరాయి. దీంతో ఆదివారం నాడు ఉదయం నుండే విజయవాడ-హైద్రాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయింది. ఉమ్మడి నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి లోట్ ప్లాజా, విజయవాడకు సమీపంలోని పొట్టిపాడు టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జాం అయింది.
 
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని తమ స్వంత ఊళ్లకు బయలుదేరారు. ఆదివారం నుండి సెలవులు కావడంతో ఎక్కువ మంది ఇవాళ ఉదయం నుండి స్వంత ఊళ్లకు బయలుదేరారు. టోల్ ప్లాజా వద్ద ఫాస్టాగ్ వద్దతిని అమలు చేసినా కూడ ప్రయాణీకులకు తిప్పలు తప్పలేదు. 
 
పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఆదివారం నాడు ఉదయం నుండే సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అయింది. ఫాస్టాగ్  ఉన్నా కూడ వాహనదారులు టోల్ ప్లాజా వద్ద ఎదురు చూడాల్సి వచ్చింది. ఇక ఫాస్టాగ్ సౌకర్యం లేనివారు ఎక్కువసేపు ఎదురు చూడాల్సి వస్తోందని ప్రయాణీకులు చెబుతున్నారు. ప్రయాణీకుల రద్దీ పెరిగే అవకాశం ఉన్న విషయాన్ని గుర్తించి ముందు జాగ్రత్తలు తీసుకొంటే పరిస్థితి మరోలా ఉండేదని ప్రయాణీకులు అభిప్రాయపడుతున్నారు. 
 
ఇక విజయవాడకు సమీపంలోని పొట్టిపాడు టోల్‌ప్లాజా వద్ద ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. పొట్టిపాడు టోల్‌ప్లాజా వద్ద కూడ సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments