Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌కు ఆ విషయం ముందే తెలియదా?: సబితమ్మ సూటి ప్రశ్న

Webdunia
శుక్రవారం, 17 జులై 2015 (17:44 IST)
చాలాకాలం తర్వాత మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీన్లోకి వచ్చారు. వచ్చీ రావడం తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు సాగు, తాగునీరు అందించడం కేసీఆర్‌కు ఇష్టం లేనట్టు ఉందని సబితా తెలిపారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ.. ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా కావాలని డిమాండ్ చేసినప్పుడు కేసీఆర్‍‌కు ఈ ప్రాజెక్టు డిజైన్ సరికాదని తెలియదా? అని సూటిగా ప్రశ్నించారు. 
 
చేవెళ్లలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ ఏం మాట్లాడారో అందరికీ తెలుసునన్నారు. చేవెళ్లకు నీరందకుండా డిజైన్ మారిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలంగాణ ప్రభుత్వాన్ని సబిత హెచ్చరించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పును ప్రజలు అంగీకరించట్లేదని, ఒకవేళ ప్లాన్ మార్చాలనుకున్నా.. కాంగ్రెస్ పార్టీకి పేరొస్తుందని కేసీఆర్ భావిస్తున్నట్లు సబిత దుయ్యబట్టారు. పార్టీలకు మార్కులు ప్రధానం కాదని, ప్రభుత్వాలు ప్రజా ప్రయోజనాలు పరిరక్షించాలని సబితమ్మ కేసీఆర్‌కు సూచించారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments