Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా రోగికి రూ. 17.5 లక్షలు బిల్లు, ప్రైవేటు ఆస్పత్రి చేతివాటం ఏమిటి?

Webdunia
బుధవారం, 29 జులై 2020 (14:42 IST)
హైదరాబాదు నగరంలో కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు దారుణంగా ప్రవర్తిస్తున్నాయి. కరోనా సోకిన బాధితులు చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తే వారినుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ జలగల్లా రక్తం పీల్చినట్టుగా పీలుస్తున్నాయి. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న ఓ వృద్ధురాలు కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ప్రైవేటు ఆస్పత్రి వేసిన ఫీజును చూసి గుండేపోటుతో మరణించాడు.
 
అంతేకాక కరోనా సోకిన ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ఆస్పత్రులలో చేరితే సాటి వైద్యులని కూడా చూడకుండా వారిపై కూడా ఫీజులు బాదుతున్నారు. ఏమని ప్రైవేటు యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే వారిని బంధిస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు కొత్తగా కరోనా రోగికి రూ. 17.5 లక్షలు బిల్లు వేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలకెళితే కరోనా భాదపడుతున్న వ్యక్తి, అతని భార్య 10 రోజుల క్రితం హైదరాబాదు సోమాజిగూడాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరారు.
 
అక్కడ 10 రోజుల పాటు వైద్యం అందుకున్న ఆ వ్యక్తికి రూ. 17.5 లక్షల బిల్లు వేశారు. కాగా ఆ బిల్లులో 8 లక్షలు వారి కుటుంబ సభ్యులు కట్టారు. ఈ క్రమంలో బాధితుని భార్య కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో ఆస్పత్రి యాజమాన్యం మొత్తం బిల్లు కడితేనే భార్య మృతదేహాన్ని ఇస్తాననడంతో ఆ మాటలకు బాధితుడు ఆవేదనతో గుండెపోటు వచ్చి మరణించాడు. ప్రస్తుతం ఆస్పత్రి యాజమాన్యం బాధితుడి కుటుంబాన్ని బెదిరిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ ఆస్పత్రుల బాదుడు మామూలుగా వుండటంలేదు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments