కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ- గులాబీ నేత‌ల‌ను ఎందుకు పట్టించుకోరు..?

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (16:52 IST)
తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
 
అక్రమార్కులపై ఉక్కుపాదం అంటూ అప్పుడప్పుడు అధికారుల హంగామా తప్ప చర్యలు లేవ‌న్నారు రేవంత్‌. గులాబీ నేత‌ల‌ అక్రమాలపై ఎందుకు పట్టించుకోవడం లేదని కేటీఆర్‌ను ప్ర‌శ్నించారు. ఇదంతా మీకు చేత‌కాకనా.. లేక అందులో వాటాలు ఏమైనా ఉన్నాయా? అని నిల‌దీశారు.
 
జవహర్ నగర్ లో 488 సర్వే నెంబర్ లో మంత్రి మల్లారెడ్డి బంధువులు అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా జ‌రుగుతున్నాయ‌ని చెప్పారు రేవంత్. అక్కడ ఆసుపత్రి కూడా నిర్మించి మరో మంత్రి చేత ప్రారంభం చేశార‌ని.. ఇది అంత ఆషామాషీ విషయమా? అంటూ కేటీఆర్‌ను ప్ర‌శ్నించారు.  
 
దేవరయాంజల్ 437 సర్వే నెంబర్‌లో మీ కుటుంబమే దేవాలయ భూమిని ఆక్రమించి పత్రికలు నడుపుతున్నార‌ని కేటీఆర్‌కు గుర్తు చేశారు రేవంత్‌. ఇలా గ్రేటర్‌లో గులాబీ నేత‌ల క‌బ్జాలు కోకొల్ల‌ల‌ని వివ‌రించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi Tour: రామ్ చరణ్ పెద్ది పవర్‌ప్లే టూర్ ప్రారంభించింది

నిర్మాత, ఎగ్జిబిటర్ల మధ్య దూషణలు, థియేటర్ ఆదాయంపై వివాదం చెలరేగింది

జగపతి బాబు, ఆకెళ్ల వి కృష్ణ కాంబినేషన్ చిత్రం వదలా టైటిల్ సాంగ్ రిలీజ్

Sanjaydath: ది డెవిల్ ఆగ‌మ‌నం - కెడి: ది డెవిల్ ట్రైల‌ర్‌తో మాస్ హంగామా

అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోన్న చంద్రహాస్.. బరాబర్ ప్రేమిస్తా

తర్వాతి కథనం
Show comments