భూ వివాదంలో రేవంత్ రెడ్డి, అభియోగాలు నమోదు

Webdunia
గురువారం, 27 ఫిబ్రవరి 2020 (18:49 IST)
గొపన్ పల్లి ల్యాండ్ వ్యహారంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2016లో నమోదైన కేసులో రేవంత్ రెడ్డిపై గచ్చిబౌలీ పోలీసులు చార్జీ షీట్ వేశారు. ఈ ల్యాండ్ కేసులో రేవంత్ రెడ్డి ప్రమేయం ఉందని తేల్చిన పోలీసులు ఆయనతో పాటు పాటుగా కొండల్ రెడ్డి, లక్ష్మయ్య పేర్లను కూడా చార్జిషీట్లో చేర్చారు. సర్వే నెంబర్ 127 సంబంధించిన ల్యాండ్ కేసులో రేవంత్‌పై అభియోగాలు నమోదు చేశారు. అక్రమంగా మ్యుటేషన్ చేసిన అప్పటి ఆర్డీఓ శ్రీనివాస్ రెడ్డిని సస్పండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 
 
అయితే ఈ ల్యాండ్‌కు సంబంధించి ఇప్పటికీ తామే నిజమైన యాజమానులమంటూ కొందరు ముందుకు వచ్చారు. ఈ ల్యాండ్ విషయంలో గతంలోనే పోలీసులకు ఫిర్యాదులు అందాయి. 
2016లో గచ్చిబౌలీ పోలీసులకు పెద్దిరాజు అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా.. కొండల్ రెడ్డిపైన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. తాజాగా డిప్యూటి కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేయడంతో రేవంత్ రెడ్డికి సంబంధించి గోపన్‌పల్లి ల్యాండ్ వ్యవహారం వెలుగోకి వచ్చింది. 
 
సర్వే నెంబర్ 127లో కట్టడాలను రేవంత్ రెడ్డి దౌర్జన్యంగా కూల్చివేశారంటూ బాధితులు ఫిర్యాదు చేశారు. అక్కడ వున్న గదిని రేవంత్‌ రెడ్డితో పాటు మరికొందరు వచ్చి కూల్చేశారని.. ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ స్థలం వివాదానికి సంబంధించి రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి,  లక్ష్మయ్యల పేర్లను తన ఫిర్యాదులో పేర్కొన్నారు పెద్ది రాజు. అయితే ఈ ల్యాండ్ తమదేనంటూ.. పెద్దిరాజుతో పాటుగా కొండల్ రెడ్డి కూడా వాదిస్తున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవలు మొదలయ్యాయి. పది ఎకరాల ఈ భూమిలో కొంత భాగం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. 2016 లోనే నమోదైన ఈ కేసులో పోలీసులు 2019లో చార్జీషీట్ దాఖలు చేసి కోర్టుకు సమర్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఎన్టీఆర్ నీల్ చిత్రం అప్ డేట్ - మే 20న గ్లింప్స్, జూన్ 11న సినిమా విడుదల

Nani: నాని క్లాప్ తో లాంఛనంగా ప్రారంభమైన విజయ్ దేవరకొండ మూవీ

Raghu Kunche: గేదెల రాజు క్యారెక్టర్ భయపెట్టేలా ఉండేందుకు 12 కేజీల పెరిగాను : రఘు కుంచె

Vijay Sethupathi: పూరి జగన్నాథ్- స్లమ్ డాగ్ స్పెషల్ ఫిల్మ్ గా గుర్తుండిపోతుంది : విజయ్ సేతుపతి

Chiranjevi: గొప్ప మనసు చాటిన మెగాస్టార్ చిరంజీవి 20 లక్షల వైద్య సహాయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోల్డెన్ మిల్క్ హెల్త్ సీక్రెట్స్

గుండె సంబంధ వ్యాధులు రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

తాజా పిండి: ఆధునిక వంటగదులకు సాంప్రదాయ పిండి రుబ్బే పద్ధతిని తెస్తున్న సాఫ్టెల్

అక్షయ తృతీయ ప్రచారంతో కృతిశెట్టితో దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ప్రకటించిన ఇంద్రియ

హైదరాబాద్‌లో తొలిసారిగా జరిగిన ది లీలా మొజాయిక్ 2026కి విశేష స్పందన

తర్వాతి కథనం
Show comments