Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాస సర్కారుకు గులాం గిరి చేస్తున్న టీఎస్ పోలీసులు.. రేవంత్ రెడ్డి ట్వీట్

Webdunia
శుక్రవారం, 16 జులై 2021 (15:24 IST)
పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపునకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ శుక్రవారం ఛలో రాజ్‌భవన్‌ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరవుతున్న కార్యకర్తలను, నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడమే కాక అరెస్టులు కూడా చేసింది. అయితే, తమ ఛలో రాజ్‌భవన్‌కు అనుమతి ఇచ్చిన పోలీసులు.. ఆ తర్వాత అడ్డుకోవడం ఏమిటని టి కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. 
 
ఈ క్రమంలో టీపీసీసీ ప్రెసెడింట్‌ రేవంత్‌ రెడ్డి ట్విట్టర్‌లో షేర్‌ చేసిన ఓ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దీనిలో ఇందిరా పార్క్‌ దగ్గర నిరసన తెలపుతున్న వెంకట్‌ బల్మూర్‌ అనే కాంగ్రెస్‌ కార్యకర్తను పోలీసులు రోడ్డు మీద పరిగెత్తించి మరీ అరెస్టు చేశారు. ఒక్క వ్యక్తిని అరెస్ట్‌ చేయడం కోసం దాదాపు ఏడేనిమిది మంది పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అనంతరం వెంకట్‌ని బలవంతంగా అక్కడ నుంచి తీసుకెళ్లారు. 
 
ఇందుకు సంబంధించిన వీడియోని రేవంత్‌ రెడ్డి తన ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. 'పోలీసులు దారుణ ప్రవర్తనకు నిదర్శనం ఈ వీడియో. ముందస్తు అనుమతితో శాంతియుతంగా నిరసన చేస్తున్న కార్యకర్తలను అరెస్టు చేశారు. పోలీసులు టీఆర్‌ఎస్‌ సర్కార్‌కు గులాం గిరి చేస్తున్నారు' అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. 

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments