Webdunia - Bharat's app for daily news and videos

Install App

సన్నబియ్యం పేరుతో రూ.కోట్ల అవినీతి : రేవంత్ రెడ్డి ధ్వజం

Webdunia
ఆదివారం, 11 అక్టోబరు 2015 (14:51 IST)
వసతిగృహాల్లో విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం పెడుతున్నట్లు ప్రభుత్వం చెబుతున్నవన్నీ అసత్యాలని తెదేపా ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. వసతిగృహాల విద్యార్థులకు దారుణమైన బియ్యంతో అన్నం పెడుతున్నారని... సన్నబియ్యం ముసుగులో రూ.కోట్లలో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. 
 
ఆయన ఆదివారం హైదరాబాద్ ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ... దొడ్డు బియ్యాన్ని పాలిష్‌ చేసి సన్నబియ్యంగా చెబుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే పాఠశాలలు, వసతిగృహాల్లో బియ్యంపై విజిలెన్స్‌ దాడులు చేయించాలని డిమాండ్‌ చేశారు. 
 
వసతి గృహాల్లో బియ్యం నమూనాలు సేకరించి నాణ్యతను పరీక్షించాలన్నారు. సీఎం కుటుంబ సభ్యులెవరైనా వసతిగృహాల్లో భోజనం చేయగలరా? అని సవాల్‌ చేశారు. అవినీతిని సహించేది లేదని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ దీనిపై ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments