Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్లు కొనడానికి, బంగళాలు కట్టించడానికి కోట్లకు కోట్ల ఖర్చు : రేవంత్ రెడ్డి ఫైర్

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2015 (14:10 IST)
కార్లు కొనడానికి, బంగళాలు కట్టించడానికి కోట్లకు కోట్ల ఖర్చు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆత్మహత్యలకు పాల్పడుతున్న అన్నదాతలకు మాత్రం రుణమాఫీ చేయడానికి పైసా కూడా లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. గజ్వేల్‌ టీడీపీ నేత ప్రతాప్‌రెడ్డి నిరాహార దీక్షకు సంఘీభావం ప్రకటించిన రేవంత్ రెడ్డి తెరాస సర్కారుపై మండిపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వ స్పందన సరిగా లేకపోవడం వల్లే ప్రత్యక్ష ఆందోళనలకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కార్లు కొనడానికి, బంగళాలు కట్టించడానికి కోట్లకు కోట్ల రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం లక్ష రూపాయల అప్పు ఉన్న రైతులకు ఒకేసారి రుణమాఫీ చేయడానికి డబ్బులు లేవని చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు.
 
రైతుల్ని ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. రెడ్డి. సీఎం పదవి చేపట్టడానికి గంట కూడా ఆగని కేసీఆర్‌... అధికారంలోకి వచ్చి 16 నెలలైనా రైతులకిచ్చిన హామీల్ని ఎందుకు నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో ఫాం హౌస్‌ ప్రభుత్వం నడుస్తుందోనని... మంత్రివర్గం తగిన స్థాయిలో పనిచేయడం లేదని దుయ్యబట్టారు. 

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments